స్త్రీనిధి రుణం.. మహిళాభ్యున్నతికి మార్గం
పొదుపు సంఘాల్లో చేరుతూ మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దాచిన డబ్బుకు తోడు బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాము లవుతున్నారు. సంఘాల్లోని
ఈ ఏడాది పంపిణీ లక్ష్యం రూ.190 కోట్లు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
మహిళా సంఘం సమావేశం
పొదుపు సంఘాల్లో చేరుతూ మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దాచిన డబ్బుకు తోడు బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాము లవుతున్నారు. సంఘాల్లోని సభ్యులకు రుణాలు సైతం సులభంగా అందుతున్నాయి. వాయిదాలు సక్రమంగా చెల్లించడమే దీనికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం స్త్రీనిధి రుణ లక్ష్యాలను ఖరారు చేసిన నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
1.90 లక్షల మంది సభ్యులు
జిల్లాలో 692 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు 18,795. ఆయా సంఘాల్లో 1.90 లక్షల మంది సభ్యులున్నారు. అర్హత గల వారందరినీ సంఘాల్లో చేర్పించేందుకు కొత్తవాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.
ప్రారంభం నుంచే..
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదైనా గ్రామైక్య సంఘం పరిధిలో సాంకేతిక సమస్యలు ఉంటే, రుణాల పంపిణీ వేగవంతమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని భావిస్తున్నారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో ముందుకుసాగుతూ ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో పూర్తిచేసేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు.
గతేడాది కంటే రూ.45 కోట్లు అధికం
పొదుపు మహిళలకు స్త్రీనిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.190.90 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది కంటే రూ.45 కోట్లు ఎక్కువ. రుణాల పంపిణీ ప్రక్రియ వేగవంతం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం..
-మోహన్రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్
రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రణాళికతో ముందుకుసాగుతాం. అధికారులు, సిబ్బంది అన్న తేడాలేకుండా సమష్టిగా వ్యవహరిస్తాం. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దుకుంటాం. బ్యాంకు రుణాలకు తోడు స్త్రీనిధి రుణాలు తీసుకోవడంతోపాటు సద్వినియోగంపై మహిళలకు అవగాహన పెంపొందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్