నిఘా నీడన పది పరీక్షలు!
కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రెండేళ్ల తర్వాత పదో తరగతి ప్రధాన పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమైంది. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు సిలబస్ను, ప్రశ్నాపత్రాలను కుదించారు. ఈ క్రమంలో ఈనెల 23 నుంచి ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్తో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది....
పకడ్బందీగా ఏర్పాట్లు
‘న్యూస్టుడే’తో జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్
న్యూస్టుడే, మెదక్
చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు
కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రెండేళ్ల తర్వాత పదో తరగతి ప్రధాన పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమైంది. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు సిలబస్ను, ప్రశ్నాపత్రాలను కుదించారు. ఈ క్రమంలో ఈనెల 23 నుంచి ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్తో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..
గంట ముందు చేరుకోవాలి..
జిల్లాలో ఈనెల 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్న పరీక్షలకు 11,400 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకుగాను 72 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఉంటుంది. గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. దూర ప్రాంతాల వారికి పరీక్ష కేంద్రాల నుంచి రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశాం. బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి కేంద్రాలకు వచ్చేందుకు స్థానికంగా ఆటోలను అందుబాటులో ఉంచాలని సూచించాం. అన్ని కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా...
ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘానీడలో పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలో ఏడు పాఠశాలలకు ప్రహరీ లేదు. అక్కడ అదనంగా కెమెరాను ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ పూర్తి చేశాం. ప్రశ్నపత్రాలను తెరవడం, పరీక్ష ముగిసిన తర్వాత వాటికి సీల్ వేసేంత వరకు పర్యవేక్షణ ఉంటుంది.
మౌలిక వసతుల కల్పన
తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాల వద్ద వైద్య సౌకర్యం అందించేందుకు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. శౌచాలయాల నిర్వహణ బాధ్యతలను పంచాయతీ, మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాం.
కలెక్టరేట్లో కంట్రోల్రూం..
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే డీఈవోతో పాటు మండలాల వారీగా విద్యాశాఖ అధికారులను చరవాణుల్లో సంప్రదించవచ్చు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్రూం ఏర్పాటు చేశాం. పరీక్షల సహాయ కమిషనర్ 94916-76947, నోడల్ అధికారి 94412-75039, జిల్లా విద్యాశాఖ అధికారి 81069-99625 నంబర్లలో సంప్రదించవచ్చు. చిన్నశంకరంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల వారు యాదగిరి(ఎంఈవో) 94404-37801, మెదక్, హవేలిఘనపూర్, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, రామాయంపేట, నిజాంపేట మండలాల వారు నీలకంఠం (ఎంఈవో) 94409-67306, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్చెడ్, చేగుంట, నార్సింగి, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల వారు బుచ్చానాయక్ (ఎంఈవో) 63005-83638 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఆందోళన వద్దు..
గత సెప్టెంబర్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నాటి నుంచి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. సిలబస్ కుదించడం, ప్రశ్నాపత్రాలను తగ్గించడం వల్ల విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా.. మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
చరవాణులకు అనుమతి లేదు..
చరవాణులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదు. పరీక్ష కేంద్రంలో ఉండే సిబ్బందికి ఐడీ కార్డులు అందజేస్తున్నాం. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 17 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందితో పర్యవేక్షణ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్