logo

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: భాజపా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా గెలుపు ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం కందిలో సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్‌ నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన

Published : 22 May 2022 02:31 IST

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా గెలుపు ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం కందిలో సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్‌ నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు తెరాస ఇచ్చిన హామీలను.. వాటిని నెరవేర్చని వైనాన్ని  ప్రచారం చేయాలని కోరారు. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తెరాస ఏ వర్గాలకూ న్యాయం చేయలేదని.. అందరూ అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 27వ తేదీలోపు నియోజకవర్గంలో బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, నాయకులు సంగమేశ్వర్‌, సురేందర్‌, మాణిక్‌రావు, హరీశ్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు పాపయ్య, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని