కఠోర శిక్షణ.. భవితకు నిచ్చెన
రగ్బీ.. ఎంతో కఠినమైన క్రీడ. ఇందులో వేగంతో పాటు ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల ఉంటేనే రాణించగలం. చురుకుదనం ఉండాలి. గాయపడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఆటలో ఎంతో మంది అడుగుపెడుతుండగా తమదైన
న్యూస్టుడే, చేగుంట
రగ్బీలో సాధన చేస్తూ..
రగ్బీ.. ఎంతో కఠినమైన క్రీడ. ఇందులో వేగంతో పాటు ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల ఉంటేనే రాణించగలం. చురుకుదనం ఉండాలి. గాయపడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఆటలో ఎంతో మంది అడుగుపెడుతుండగా తమదైన రీతిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ క్రీడలో మరింత మంది ప్రవేశించేందుకు ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనుగుణంగా రగ్బీ క్రీడాకారులకు నిలయమైన చేగుంటలో వేసవి క్రీడా శిబిరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తర్ఫీదు పొందుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో శిబిరం తీరుతెన్నులపై కథనం.
గ్రామీణ ప్రాంతానికి క్రీడాకారులెంతో మంది రగ్బీలో రాణించాలన్న ఆసక్తి ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి అండగా నిలవాలన్న సదుద్దేశంతో చేగుంటలో రగ్బీ వేసవి శిబిరం నెలకొల్పారు. పిల్లలు భవిష్యత్తులో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ శిక్షకులు అందుబాటులో ఉండటం, ఈ ప్రాంతానికి చెందిన వారెంతో మంది ఈ ఆటలో ప్రవేశించి బహుమతులు సాధించడంతో ఇక్కడ సదరు శిబిరం ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది.
నెల రోజుల పాటు..
ఉమ్మడి జిల్లాలో ఒక్క చేగుంటలో సదరు శిబిరం కొనసాగుతోంది. రగ్బీ, టచ్ రగ్బీ ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షకుడు కరణం గణేష్రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణలో నిత్యం శిక్షణ ఇస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన బాలబాలికలు పాల్గొంటున్నారు. బంతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రత్యర్థికి అందకుండా గోల్ను ఎలా పూర్తి చేయాలన్న దానిపై తర్ఫీదు ఇస్తున్నారు. అండర్-14 నుంచి సీనియర్ విభాగం వరకు ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పించారు. టచ్ రగ్బీలో.. బంతిని పట్టుకొని వెళ్తున్న వారిని రెండు చేతులతో టచ్ చేస్తే ఆగిపోవాల్సి ఉంటుంది. బంతిని ప్రత్యర్థి జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. నెల రోజుల పాటు శిక్షణ సాగనుంది.
త్వరలోనే రాష్ట్ర స్థాయి పోటీలు
త్వరలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ ప్రతిభ చూపే జిల్లా జట్టును ఇందులో నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది. చేగుంటలోని తెలంగాణ గిరిజన బాలికల క్రీడా గురుకులం నుంచి కొందరు ఇందులో పాల్గొంటున్నారు. రగ్బీలో ప్రతి జట్టులో ఏడుగురు ఆడాల్సి ఉంటుంది. వీరు చురుకుగా ఉండి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చిన గోల్ను కోల్పోతారు. ఇక్కడి శిబిరంలో కఠినమైన శిక్షణ పొందుతూ తమదైన ప్రత్యేకత చాటుతున్నారు. రగ్బీ శిక్షణ పొందేందుకు తమ పిల్లలను ఉత్సాహంగా పంపిస్తున్నారు పలువురు తల్లిదండ్రులు. ఇతర క్రీడలకంటే భిన్నంగా ఉండే ఈ ఆటలో పరిణతి సాధిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొనేందుకు వీలుంటుంది.
ఆసక్తితో వస్తున్నా: నరేష్, యాదగిరిగుట్ట
ఇతర ఆటల కంటే భిన్నమైనది కావడంతో నేర్చుకోవాలన్న తపనతో ఈ శిబిరంలో చేరాను. శిక్షణ ఎంతో మంచిగా ఉంది. వేగంగా పరుగుపెడుతున్నా. బంతిని అందుకునేందుకు పోరాటం చేస్తున్నాను. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో రాణిస్తానన్న నమ్మకం ఉంది.
జాతీయ స్థాయిలో..: శివశంకర్, చేగుంట
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై అందులో ప్రతిభను చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడమే ముందున్న లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నా. ఇతర ఆటల కంటే ఇదెంతో భిన్నమైనది. కఠినంగా ఉన్నా ఆడుతుంటే సంతోషంగా ఉంది.
సంతోషంగా ఉంది: వెన్నెల
గతంలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో ఆడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నా. నా భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నా.
తల్లిదండ్రుల ప్రోత్సాహం: గాయత్రి
రగ్బీ ఆట గురించి తల్లిదండ్రులు చెప్పాను. వారు ఏమాత్రం సంకోచించకుండా ఆడేందుకు ప్రోత్సహించారు. ఇక్కడ శిక్షకులు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. చిన్నతనం నుంచే ఈ ఆటలో ప్రావీణ్యం సాధించేందుకు దోహదం చేస్తుంది.
రతిభను గుర్తించేందుకు..: కరణం
గణేష్రవికుమార్, శిక్షకుడు
క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. ఆసక్తి ఉన్న వారికి అవకాశం ఇచ్చాం. నిత్యం వంద మంది వరకు వస్తున్నారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఇందులో నుంచే ఎంపిక చేయనున్నాం. ఇందుకు కసరత్తు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే