నిఘా నీడలో ‘పది’ పరీక్షలు
రెండేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23 నుంచి మొదలవుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, ఫర్నిచర్ సౌకర్యాలతో పాటు ఏఎన్ఎంలు కూడా అందుబాటులో
కేంద్రాలన్నింటా సీసీ కెమెరాలు
విద్యార్థులూ.. ఒత్తిడికి లోనుకాకుండా రాయండి
‘న్యూస్టుడే’తో ముఖాముఖిలో డీఈవో రాజేష్
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
రెండేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23 నుంచి మొదలవుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, ఫర్నిచర్ సౌకర్యాలతో పాటు ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉంటారని జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ పేర్కొన్నారు. అధైర్య పడకుండా.. ఒత్తిడికి లోనుకాకుండా రాయాలని ఆయన సూచించారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తామని, గంట ముందుగానే చేరుకోవడం ఉత్తమమని చెప్పారు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రాయాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ‘న్యూస్టుడే’తో ముఖాముఖిలో డీఈవో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే..
22,564 మంది విద్యార్థులు
117 కేంద్రాల్లో 22,564 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 11,564 మంది బాలురు, 11,089 బాలికలు. నిర్వహణ కోసం 117 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఉన్న ఐదు స్క్వాడ్ బృందాలు, 1286 మంది ఇన్విజిలేటర్లను నియమించాం.
చరవాణులకు అనుమతి లేదు..
విధుల్లో ఉండే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు చరవాణిలను ఇంటి వద్దనే ఉంచి రావాలి. కేంద్రంలో వీటికి అనుమతి లేదు. ఇక్కడ డిపాజిట్ చేస్తామంటే కుదరదు. పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశాం. వాటిని తప్పని సరిగా మెడలో ధరించాలి.
సమస్యలుంటే ఫోన్ చేయండి
కేంద్రాల వద్ద జిల్లా విద్యాధికారి, ఆయా మండల విద్యాధికారి ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి. ప్రతి కేంద్రానికి ఈ విషయమై సర్య్కులర్ పంపించాం. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే ఆయా నంబర్లకు ఫోన్ చేయవచ్చు. దీనితో పాటు పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన విధులు, పాటించకూడనివి కూడా ఆ సర్క్యులర్లో పేర్కొన్నాం. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
ప్రశాంతంగా రాస్తే మంచి మార్కులు
పరీక్షకు వచ్చే విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి. తొలి 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవాలి. ఆ తరువాత మొదట బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. మిగతా వాటిపై తర్వాత దృష్టి పెట్టాలి. ఇప్పటికే రెండుసార్లు ప్రీ ఫైనల్ పరీక్షలు రాసినందున కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాస్తే మంచి మార్కులు కచ్చితంగా వస్తాయి.
5 నిమిషాల వరకు అనుమతి
ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 9.35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను లోనికి అనుమతిస్తాం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించాం. ఎక్కడైనా బస్సులు రాకుంటే, మా దృష్టికి తీసుకువస్తే ఆర్టీసీ అధికారులతో మాట్లాడతాం. కేంద్రం వద్ద 14 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలి. తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో నిఘా నీడలో పరీక్షలు జరుగుతాయి. 74 ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. 43 ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న వాటిని వినియోగించుకుంటాం. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు వినియోగించే గదితో పాటు వరండాలో ఇవి ఉంటాయి. ప్రశ్నపత్రం ఓపెన్ చేసినప్పటి నుంచి సీల్ వేసే వరకు కెమెరాల పర్యవేక్షణలోనే జరగాలి. ఈ క్రమంలో అక్రమాలకు ఆస్కారం ఉండదు.
చూచిరాతను ప్రోత్సహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం
పరీక్షల్లో చూచిరాతను ప్రోత్సహించే ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరిస్తాం. అక్టోబరు నాటికి సిలబస్ పూర్తి చేశాం. రెండు సార్లు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధులను చేశాం.
ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం: ఆర్టీసీ
పదో తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మక్త క్యాసారం నుంచి బయలుదేరి పెద్ద చల్మెడ, కంకోల్, బుదేరా పరీక్ష కేంద్రాల మీదుగా సదాశివపేట వరకు, మల్లికార్జునపల్లి నుంచి మునిపల్లి వరకు, ఆత్మకూరు నుంచి సదాశివపేట వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బస్ పాస్ ఉంటే విద్యార్థి నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రం వరకు రూట్ మారినా ఉచితంగా అనుమతిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 7392800834, 9491810630 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.జహీరాబాద్ పరిధిలోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డీఎం రజనీకృష్ణ పేర్కొన్నారు. 9154298656, 7382924743 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె