బడులు తెరిచేలోపు అభివృద్ధి పనులు పూర్తి
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో మన ఊరు-మన బడి, దళితబంధు, పల్లె ప్రగతి, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు
పల్లె ప్రగతికి సిద్ధం కావాలి
అధికారులతో సమీక్షలో పాలనాధికారి
మాట్లాడుతున్న హనుమంతరావు, చిత్రంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, పశు సంవర్ధక అధికారి వసంతకుమారి
సంగారెడ్డి టౌన్, న్యూస్టుడే: మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో మన ఊరు-మన బడి, దళితబంధు, పల్లె ప్రగతి, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు తదిత అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు తెరిచేలోపుగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గానికి రెండు చొప్పున ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం దాదాపు రూ.7వేల కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు. అంచనా వ్యయం రూ.30 లక్షలు దాటితే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలను గడువులోగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. దళితబంధు పెండింగ్ యూనిట్ల గ్రౌండింగ్ ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. పాడిగేదెల కొనుగోలు, షెడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాస్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి సునీత, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?