జనావాసాల్లోకి కాలుష్య వ్యర్థాలు
ధనలనిబంకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండు డెయిరీ ఉత్పత్తుల తయారీ యూనిట్ల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలిచ్చింది. పీసీబీ నియమాలను పట్టించుకోకుండా పరిశ్రమల్లో రోజువారీగా ఉత్పత్తయ్యే వ్యర్థాలు, కాలుష్య కారక జలాల్ని శుద్ధి చేయకుండానే
రెండు డెయిరీల మూసివేతకు పీసీబీ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: ధనలనిబంకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండు డెయిరీ ఉత్పత్తుల తయారీ యూనిట్ల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలిచ్చింది. పీసీబీ నియమాలను పట్టించుకోకుండా పరిశ్రమల్లో రోజువారీగా ఉత్పత్తయ్యే వ్యర్థాలు, కాలుష్య కారక జలాల్ని శుద్ధి చేయకుండానే బయటకు విడుదల చేస్తున్నాయని గుర్తించింది. కాలుష్య కారక జలాల్ని కామన్ ఎఫ్లూయేంట్ ట్రీట్మెంట్ ప్లాంటు(సీఈపీటీ) తరలించడానికి బదులుగా బయటకు వదిలేస్తున్నాయని నిర్ధారించింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు, ఇతర సమాచారం ఆధారంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపం పాశమైలారంలోని పవిత్ర డెయిరీ, విశాఖ డెయిరీల్ని తనిఖీ చేసిన అధికారులు వాటిని మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. పవిత్ర డెయిరీపై జనవరిలో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నిషేధిత రసాయనాలు, గుర్తింపు పొందని పాల పొడి, ఎక్కువ మోతాదులో సిట్రిక్ యాసిడ్ వినియోగించి పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తనిఖీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పీసీబీకి ఫిర్యాదు చేశారు.
డ్రైనేజీలోకి వ్యర్థాలు: విశాఖ పాల ఉత్పత్తుల సంస్థ వ్యర్థాల్ని స్థానిక పారిశ్రామికవాడ పరిసరాల్లోని డ్రైనేజీలోకి విడుదల చేస్తోందని అధికారులు తనిఖీల్లో గుర్తించారు. నిబంధనల ప్రకారం పరిశ్రమల నుంచి విడుదలయ్యే వర్థాల్ని సీఈపీటీకి తరలించాలి. ఇవేవీ పట్టించుకోకుండా కొన్ని నెలలపాటు వ్యర్థాల్ని నాలాలోకి విడుదల చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతోపాటు సంస్థ ఆవరణలోని ఖాళీ స్థలంలో ప్లాస్టిక్ వ్యర్థాల్ని భారీగా నిల్వ చేశారు. ఇలా నిల్వ చేయాలంటే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2018 కింద ఆయా సంస్థలు నమోదు చేసుకోవాలి. సదరు పరిశ్రమ పీసీబీ అనుమతి లేకుండానే నిర్వహిస్తోందని అధికారులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా