గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు
ఏ రంగమైనా సదుపాయాలు కల్పించడం, ప్రోత్సహించడం, వెన్నుతట్టడం చేస్తే రాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణం సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. చిన్ననాటి నుంచే శిక్షకుడి పర్యవేక్షణలో కఠోర సాధన చేయడం, ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఆమె ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. క్రీడా మైదానాలు...
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశాలు
న్యూస్టుడే, మెదక్
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు (పాతచిత్రం)
ఏ రంగమైనా సదుపాయాలు కల్పించడం, ప్రోత్సహించడం, వెన్నుతట్టడం చేస్తే రాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణం సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. చిన్ననాటి నుంచే శిక్షకుడి పర్యవేక్షణలో కఠోర సాధన చేయడం, ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఆమె ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. క్రీడా మైదానాలు పట్టణాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితం అవగా, పల్లెల్లో అవి లేక సత్తా ఉన్న క్రీడాకారులు వెలుగులోకి రావడం లేదు. ఈ క్రమంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మండలానికి కనీసం రెండు ప్రాంగణాలను ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేవలం ప్రాంగణాల ఎంపిక కాకుండా వివిధ క్రీడా కోర్టులు సైతం ఏర్పాటు చేయనున్నారు. వాటి చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం.
రాష్ట్ర రాజధానికి జిల్లా సమీపంలో ఉన్నా.. ఆయా క్రీడాంశాల్లో రాణించే క్రీడాకారులను వేళ్లపై లెక్కించవచ్చు. సరైన సదుపాయాలు, శిక్షకులు, మైదానాలు లేక యువత వెనుకబడి పోతున్నారు. జిల్లాలో కేవలం మెదక్ పట్టణంలో మాత్రమే క్రీడా మైదానం ఉంది. ఇందిరా గాంధీ స్టేడియంతో పాటు పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియం కూడా కలదు. మిగిలిన పట్టణాలైన నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్లో మైదానాలు లేవు. ఉమ్మడి చేగుంట మండలంలో ఆయా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడా మైదానం ఏర్పాటుకు స్థలం ఎంపిక చేయగా, నిధులకు ప్రతిపాదనలు పంపారు. ఇక గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఆవరణ లేదా ఖాళీ స్థలాల్లో వాలీబాల్, కబడ్డీ తదితర ఆటలు ఆడుతుంటారు.
ఖోఖో ఆడుతున్న చిన్నారులు (పాతచిత్రం)
ఇకపై ప్రతి గ్రామంలో....
గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరవైందన్న విమర్శ ప్రభుత్వంపై ఉండేది. ఈ అపవాదును తొలగించుకునేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఎకరం స్థలంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులు సిద్ధం చేయాలని సూచించింది. ముందుగా ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేసి వాటిల్లో మూడు కోర్టులతో పాటు లాంగ్జంప్ పిట్తో పాటు వ్యాయామం చేసేందుకు ఒకటి, రెండు వరుసల లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్థల సమస్య ఉన్న పంచాయతీల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల్లో ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. క్రీడా మైదానాలు సాదాసీదాగా కాకుండా పల్లెప్రగతిలో కార్యక్రమాలను ఎలా శాశ్వత ప్రాతిపదికన చేపట్టారో... వీటిని కూడా అదే విధంగా చేపట్టాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయనున్నారు. ఎంపిక చేసిన స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి వాటి చుట్టూ హరితహారంలో మొక్కలు నాటనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల పరిధిలోని పరిశ్రమలు ప్రతి ఏటా చెల్లించే సీఎస్ఆర్ నిధులతో క్రీడాకారులకు వసతులు సమకూర్చనున్నారు. తొలుత జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి మండలానికి రెండు క్రీడా ప్రాంగణాలు ఎంపిక చేయాలని ఆదేశించారు.
క్రీడాకారులకు ఉపయోగం
నాగరాజు, జిల్లా యువజన, క్రీడల అధికారి
అదనపు పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని 318 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎంపిక చేశాం. మండలానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాం. మిగిలిన పంచాయతీల్లో స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించడంతో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిరంతరం సాధనతో పాటు వ్యాయామానికి ఇవి దోహదం చేయనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్