అటకెక్కిన ఆహ్లాదం..
నియోజకవర్గ, డివిజన్ కేంద్రం నర్సాపూర్లో కుంటల సుందరీకరణకు రెండేళ్ల క్రితం పురపాలిక అధికారులు ప్రతిపాదనలు పంపగా నేటికీ అవి అమలుకు నోచుకోలేదు. నిధుల మంజూరుకు ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించి పంపగా ఒక్క
సుందరీకరణకు నోచుకోని కుంటలు
ఎదురుచూస్తున్న నర్సాపూర్ ప్రజలు
న్యూస్టుడే, నర్సాపూర్
అభివృద్ధికి నోచుకోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కుంట
నియోజకవర్గ, డివిజన్ కేంద్రం నర్సాపూర్లో కుంటల సుందరీకరణకు రెండేళ్ల క్రితం పురపాలిక అధికారులు ప్రతిపాదనలు పంపగా నేటికీ అవి అమలుకు నోచుకోలేదు. నిధుల మంజూరుకు ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించి పంపగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఆ కుంటలు కాస్తా ముక్కుపుటాలదిరే దుర్గంధాన్ని వెదజల్లుతూ, చెత్త కుండీలుగా మారి కంపు కొడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. పట్టణంలోని జల వనరుల భూములు రూ.కోట్ల విలువ పలుకుతుండగా వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో సుందరీకరణకు ప్రతిపాదించినా ఎవరికీ పట్టడం లేదు. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం.
నర్సాపూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఆవరణలోని ఊర కుంటతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయి. సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటలోకి సమీప దుకాణాల వారు చెత్తా చెదారం వేయడం, మురుగును వదలడం చేసేవారు. దీంతో అది కాస్తా దట్టమైన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ప్రయాణికులు మలమూత్ర విసర్జనతో ఆ ప్రాంతమంతా కంపు కొట్టేది. పందుల సంచారం, ఈగలు, దోమల విజృంభణతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్యకు ప్రధానంగా ఈ కుంటే కారణమని గుర్తించిన పురపాలిక దాన్ని సుందరీకరించి సమస్యల నుంచి గట్టెక్కాలని ప్రతిపాదించింది. ఇది పట్టణం మధ్యలో ఉండడంతో అందరికీ అనుకూలిస్తుందని, ఆహ్లాదాన్ని పంచుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.20 లక్షలు వ్యయం చేసి మొదట కుంట పూడ్చివేత చేపట్టడంతో అంతా సుందరీకరణకు అడుగులు పడ్డాయని సంతోషించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కుంటను పూడ్చినా సుందరీకరణ మాత్రం అటకెక్కింది. కుంట పూడ్చివేతతో సమీప విఘ్నేశ్వర కాలనీ వాసులకు కొత్త సమస్య ఎదురైంది. చిన్నపాటి వర్షం పడినా కుంటలోకి వస్తున్న వరద నీరు కాలనీని ముంచెత్తుతోంది. రూ.20లక్షల నిధులతో కట్టను విస్తరించి వాకింగ్ ట్రాక్, ఆకాశ దీపాలు, బెంచీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కుంటను పూడ్చిన స్థలంలో పూల మొక్కలు పెంచి నందన వనంగా మార్చాలని ప్రతిపాదించారు.
నర్సాపూర్లోని కోమటి కుంట
కోమటి కుంటదీ అదే పరిస్థితి..
పట్టణంలోని తూప్రాన్ మార్గంలో ఉన్న కోమటి కుంటది కూడా అదే దుస్థితి. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు, వ్యాపారులు చెత్త కుండీగా మార్చివేశారు. పురపాలిక సైతం పట్టణంలో సేకరించిన చెత్తను తరలించి ఇందులో పడవేసి కాల్చి వేస్తున్నారు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయతో సుందరీకరించాలని ప్రతిపాదించగా మంత్రి హరీశ్రావు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే సందర్శించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదం పంచాలని నిర్ణయించారు. కుంటలో బోటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని అన్నా అవేవి ఆచరణకు నోచుకోలేదు. జాతీయ రహదానిని ఆనుకుని ఉన్న ఈ కుంట భూమి విలువ రూ.కోట్లల్లో ఉంటుంది. దీంతో క్రమంగా అక్రమార్కులు కుంట స్థలంపై కన్నేసి ఆక్రమించేస్తున్నారు. చిన్నచిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకుని కబ్జాకు పావులు కదుపుతున్నారు. సుందరీకరణ మాట అటుంచి కనీసం ఆక్రమణల పాలు కాకుండా కుంటను రక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తగిన చర్యలు తీసుకుంటాం...
చాముండేశ్వరి, కమిషనర్, నర్సాపూర్ పురపాలిక
పురపాలికలోని రెండు కుంటల సుందరీకరణకు ప్రతిపాదించిన మాట వాస్తవమే. నిధులు మంజూరైతే పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితులను వివరించి వీలైనంత త్వరలో నిధులు మంజూరు చేయాలని కోరతాం. బస్టాండ్ ఆవరణలోని కుంటలోకి వచ్చే వరదను దారి మళ్లించడానికి మురుగు కాల్వ నిర్మాణం చేపట్టనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్