logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు సహాయ పడిన మరో డ్రైవర్‌పై ఎస్సై దాడికి పాల్పడ్డాడు. ఎందుకు జాప్యమైందంటూ చితకబాదారు. బాధితుడు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా చౌటకూరు

Published : 23 May 2022 02:12 IST

సాయం చేయడానికి వచ్చిన డ్రైవర్‌పై ఎస్సై దాడి

జోగిపేట, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు సహాయ పడిన మరో డ్రైవర్‌పై ఎస్సై దాడికి పాల్పడ్డాడు. ఎందుకు జాప్యమైందంటూ చితకబాదారు. బాధితుడు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధి ఉమ్నాపూర్‌ శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందోలు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన గరిగంటి కిష్టయ్య, సీహెచ్‌ సంగయ్య టీవీఎస్‌ ఎక్సైల్‌ మోపెడ్‌పై సంగారెడ్డి పట్టణానికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని రాత్రి వారిద్దరు స్వగ్రామానికి బయలురేరారు. మార్గమధ్యలోని చౌటకూరు మండలం ఉమ్నాపూర్‌ శివారుకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పర్‌.. మోపెడ్‌ను ఢీకొంది. కిష్టయ్య(35) అక్కడికక్కడే మృతి చెందగా సంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పుల్కల్‌ ఎస్సై గణేశ్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ఆ వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు మరో డ్రైవర్‌ కోసం ఆరా తీశారు. అప్పటికే ఘటనా స్థలం వద్దే ఉన్న నరసింహారెడ్డి టిప్పర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో వాహనాన్ని కొద్ది దూరం తీసుకెళ్లగానే మొరాయించింది. తనకున్న పరిజ్ఞానంతో ఎలాగోలా టిప్పర్‌ను స్టార్ట్‌ చేసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో జాప్యం జరిగింది. ఈ జాప్యానికి కారణం తెలుసుకోకుండానే ఆగ్రహించిన ఎస్సై గణేశ్‌.. లాఠీతో డ్రైవర్‌ నరసింహారెడ్డిని చితకబాదారు. బాధితుడికి చేతులు, పిక్కలపై ఎర్రటి వాతలు తేలాయి. సాయం చేయడానికి వస్తే అకారణంగా నానైనే దాడి చేశారంటూ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్సై గణేశ్‌ను వివరణ కోరగా.. తాను ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. అనవసరంగా కట్టుకథలు అల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని