logo

దైవ దర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

రోడ్డు ప్రమాదంలో మొగులమ్మ(62) మృత్యువాత పడినట్లు స్థానిక ఎస్సై ఏడుకొండలు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. ఆదివారం రాయికోడ్‌ మండలంలోని మొరట్గాకు చెందిన

Published : 23 May 2022 02:12 IST

రాయికోడ్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మొగులమ్మ(62) మృత్యువాత పడినట్లు స్థానిక ఎస్సై ఏడుకొండలు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. ఆదివారం రాయికోడ్‌ మండలంలోని మొరట్గాకు చెందిన మొగులమ్మ కుటుంబ సభ్యులతో కలిసి మెదక్‌ చర్చికి ఆటోలో బయలు దేరారు. మొగులమ్మ కుమారుడు ఆటో నడుపుతుండగా.. మామిడిపల్లి కూడలిలో ఆటోకు కుక్క అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో కుక్కను తప్పించబోగా ఆటో అదుపుతప్పి రహదారి పక్కన గోతిలో పడిపోయింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలుకాగా. మొగులమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకు జహీరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు మురారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని