అత్యవసరానికి.. ఆరుబయటకే..!
తహసీల్దార్ కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారంతోపాటు, రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నారు. దీంతో వీటికి ప్రజల తాకిడి పెరిగింది. అయితే సరిపోను గదులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు లేక వివిధ సేవలకు వచ్చిన
తహసీల్దార్ కార్యాలయాల్లో తప్పని అవస్థలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, కంది, గుమ్మడిదల, మునిపల్లి, జహీరాబాద్ అర్బన్, జోగిపేట
సంగారెడ్డిలో నిరుపయోగంగా..
తహసీల్దార్ కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారంతోపాటు, రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నారు. దీంతో వీటికి ప్రజల తాకిడి పెరిగింది. అయితే సరిపోను గదులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు లేక వివిధ సేవలకు వచ్చిన వారికి అవస్థలు తప్పడంలేదు. అత్యవసరంలో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆదాయమే లక్ష్యంగా సేవలందిస్తున్నా.. కనీస సదుపాయలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేవు. పూర్తి స్థాయిలో బల్లలు లేక, చెట్ల కిందే ప్రజలు నిరీక్షిస్తున్నారు. మూత్రశాలలు, శౌచాలయాలు లేవు. పురపాలక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది. ఇక్కడికి రిజిస్ట్రేషన్లకు నిత్యం 15 నుంచి 20 మంది వరకు వస్తుంటారు. శుద్ధి చేసిన నీటి సౌకర్యం లేదు. వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రహదారిపై నిలపాల్సివస్తోంది. నిత్యం రూ.15నుంచి రూ.16లక్షల వరకు ఆదాయం వస్తున్నా మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించడంలేదు.
శౌచాలయాలు లేక
కందిలో శౌచాలయాలు లేవు. పంచాయతీ కార్యాలయంలోనే సేవలందిస్తున్నారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం లేదు. రోజుకు 15 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్ సేవలు అమలువుతుంటాయి. సుమారుగా రూ.18లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. సౌకర్యాలు కల్పించడంలేదు.
గదులు సరిపోక
గుమ్మడిదల కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. సరిపోను గదులులేక అధికారులు, రిజిస్ట్రేషన్లకు వచ్చిన వారికి అవస్థలు తప్పడం లేదు. ఆరుబయటే నిరీక్షించాల్సి వస్తోంది. బల్లలు ఏర్పాటు చేయలేదు. శౌచాలయాలు లేవు. తాగునీటి సౌకర్యం లేదు. రోజుకు 10 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కోహీర్ కార్యాలయంలో తగినన్ని వసతులు లేవు. రిజిస్ట్రేషన్కు వచ్చిన వాళ్లకు సరిపడా కుర్చీలు లేవు. చెట్ల కింద నీరిక్షించాల్సి వస్తోంది. రోజుకు 5 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. సౌకర్యాలు లేక పోవడం వల్ల జనాలు ఇబ్బందులు తప్పడం లేదు.
గొంతెండాల్సిందే
అందోలు మండలం జోగిపేటలో రోజుకు 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లవుతున్నాయి. రోజుకు ఆదాయం రూ.లక్షల్లో వస్తోంది. కార్యాలయం ఆవరణలో కనీస సౌకర్యాలు, సరిపోను కుర్చీలు లేవు. చెట్ల కిందే వేచి ఉండాల్సి వస్తోంది. శౌచాలయాలు నిర్మించలేదు. తాగునీటికి అవస్థలు తప్పడంలేదు. చౌటకూర్లోనూ అదే పరిస్థితి.
ఉన్నవాటికి తాళం
జహీరాబాద్లో దుస్థితి
జహీరాబాద్లో పురుషులకు నిర్మించిన మూత్రశాలలు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారింది. రిజిస్ట్రేషన్, ఇతర అవసరాలకు వచ్చే వారు ఆరుబయటకు వెళ్లాల్సిందే. మహిళలకు పరిస్థితి చెప్పనక్కర్లదు. అధికారులు, సిబ్బందికి శౌచాలయాలు ఉన్నా తాళాలు వేసి ఉండటం గమనార్హం. రోజుకు ఇక్కడ 25నుంచి 30 వరకు రిజేస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
నిలబడాల్సిందే
బల్లలు సరిపోను లేక..
మునిపల్లిలో నిత్యం పది నుంచి పదిహేను వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు వస్తుంటారు. కూర్చునేందుకు బల్లలు లేక మహిళలు, పురుషులు గంటల తరబడి నిల్చోవాల్సివస్తోంది. శౌచాలయాలు లేవు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఆదాయం వస్తోంది.
పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తాం
వీరారెడ్డి , అదనపు కలెక్టర్, సంగారెడ్డి
తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలు అమలువుతున్నాయి. అక్కడికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించి ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు