పది పరీక్షలకు సర్వం సిద్ధం..
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ సిద్ధమైంది. కేంద్రాల్లో డెస్కులు, వివిధ సదుపాయాల కల్పన పూర్తయింది. ఈ నెల 23 (సోమవారం) నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9.30 నుంచి
83 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
న్యూస్టుడే, సిద్దిపేట
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ సిద్ధమైంది. కేంద్రాల్లో డెస్కులు, వివిధ సదుపాయాల కల్పన పూర్తయింది. ఈ నెల 23 (సోమవారం) నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. అరగంట ముందు నుంచే లోనికి అనుమతించనున్నారు. గంట ముందుగానే విద్యార్థులు కేంద్రం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 83 కేంద్రాల్లో రెగ్యులర్ - 14,923, ప్రైవేటుగా 8 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఐదు ఫ్లయింగ్, 13 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలన చేయనున్నాయి. 900 మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నారు. విద్యార్థులు సహా పరీక్ష సిబ్బందికి చరవాణులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోరు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల అమరిక పూర్తయింది. నిఘా నేత్రాల ముందు ప్రశ్నపత్రాలను తెరవడంతో పాటు పరీక్ష ముగిసిన తరువాత జవాబుపత్రాలు వాటిముందే సీల్ చేయనున్నారు. జిల్లాలో 21 పోలీసు ఠాణాల్లో (స్టోరేజ్ పాయింట్లు) ప్రశ్నపత్రాలు భద్రపర్చగా.. ఎస్కార్టు నడుమ తేనున్నారు. పరీక్ష ముగిసిన తరువాత రోజువారీగా భద్రత మధ్య సంబంధిత తపాలా కార్యాలయానికి చేరవేయనున్నారు. పరీక్ష ప్రారంభ సమయం దాటిన ఐదు నిమిషాల వరకు మినహాయింపుతో అనుమతించనున్నారు. సమాచారం ఇవ్వడంతో పాటు సందేహాల నివృతికి డీఈవో కార్యాలయంలో చరవాణి నంబరు 94406 65585 అందుబాటులోకి తెచ్చారు. 24 గంటల పాటు ఈ సహాయ నంబరు పని చేయనుంది. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఆందోళనకు గురవకుండా హాజరు కావాలని డీఈవో రవికాంత్రావు సూచించారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి..: మంత్రి
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఉత్తమ ఫలితాలతో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించామని, అనుగుణంగా వసతులు కల్పించాలన్నారు. విద్యార్థి భవితకు పదో తరగతి కీలక మలుపు అని, ఇన్నాళ్ల శ్రమను నిరూపించుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువులకు చక్కటి ఫలితాలు సాధించి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్