logo

వైభవంగా రథోత్సవం.. పులకించిన భక్తజనం

భక్తుల హర్షధ్వానాల మధ్య వర్గల్‌ వేణుగోపాల స్వామి విమాన రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్‌ మాజీ

Published : 23 May 2022 02:12 IST

విమాన రథోత్సవం (అంతరచిత్రంలో రుక్మిణి, సత్యభామ సహిత వేణుగోపాల స్వామి)

వర్గల్‌, న్యూస్‌టుడే: భక్తుల హర్షధ్వానాల మధ్య వర్గల్‌ వేణుగోపాల స్వామి విమాన రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రుక్మిణి, సత్యభామ సహిత వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను సుందరంగా ముస్తాబు చేసి విమాన రథంపై ప్రతిష్ఠించి వర్గల్‌ వీధుల్లో ఊరేగించారు. భజనలు, కోలాటం మధ్య రథాన్ని నడిపించారు. నిర్వాహకులు పొద్దుటూరి రాజులు గుప్త, టేకులపల్లి రాంరెడ్డి, స్థానిక సర్పంచి గోపాల్‌రెడ్డి, ఎంపీపీ లత, జడ్పీటీసీ సభ్యుడు బాలు యాదవ్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రథాన్ని లాగుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు