అనుసంధానం చేయక.. ప్రయాస తప్పక..
రహదారిని రెండు వరుసలుగా విస్తరించారు.. ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో వంతెనలు సైతం నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వంతెనలకు, రహదారికి అనుసంధానం చేయకపోవడమే సమస్యగా మారింది.
వంతెనల నుంచి రోడ్డు వేయకపోవడంతో..
న్యూస్టుడే, శివ్వంపేట
గోమారం వద్ద అసంపూర్తిగా రోడ్డు ఇలా..
రహదారిని రెండు వరుసలుగా విస్తరించారు.. ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో వంతెనలు సైతం నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వంతెనలకు, రహదారికి అనుసంధానం చేయకపోవడమే సమస్యగా మారింది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినా ప్రయాస తప్పడం లేదు. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్, జీడిపల్లి వరకున్న రహదారిపై నిర్మించిన వంతెనల పరిస్థితి ఇది.
రూ.20 కోట్లతో..
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల నుంచి మనోహరబాద్, జీడిపల్లి వరకు ఏక వరుస రహదారి ఉండేది. ఈ మార్గంలో ప్రయాణం కష్టంగా మారడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో చెన్నాపూర్-పెద్దగొట్టిముక్ల గ్రామాల మధ్య, గోమారం వద్ద ఉన్న లో లెవల్ కాజ్వేలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ రోడ్డును రెండు వరుసలకు విస్తరించేందుకు సుమారు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పనులు చేపట్టి పూర్తిచేశారు. ఇందులో భాగంగా చెన్నాపూర్, గోమారం గ్రామాల్లో రెండు వంతెనల నిర్మాణానికి ఎఫ్డీఆర్ నిధులు రూ.3.16 కోట్లు మంజూరయ్యాయి. చెన్నాపూర్లో రూ.1.86 కోట్లు, గోమారంలో రూ.1.30 కోట్లు వెచ్చించి వంతెనలు నిర్మాణం చేపట్టారు.
చెన్నాపూర్లో కంకర తేలి..
అదుపు తప్పుతున్నాయ్...
చెన్నాపూర్, గోమారం వద్ద కాజ్వేలతో గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చెన్నాపూర్ వద్ద లో లెవల్ కాజ్వేపై నుంచి కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఇలా పలు ఘటనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం నిధులను కేటాయించి వంతెనలు నిర్మించింది. ఇవి పూర్తయ్యాయని, వెతలు తీరనున్నాయని ఆయా గ్రామాలవాసులు సంతోషపడ్డారు. కానీ ఈ రెండు చోట్ల రెండు వరుసల రహదారికి వంతెనల నుంచి అనుసంధాన దారులను నిర్మించడం మాత్రం మరిచారు. నాలుగు నెలల కిందట వంతెనలు పూర్తయ్యాయి. నిర్మాణాల సమయంలో ఓ పక్కగా వేసి మట్టి దారి వేశారు. అనుసంధానం పూర్తికాకపోవడంతో ఇంకా ఆ దారిలో రాకపోకలు సాగుతున్నాయి. వర్షం పడిందంటే ఆ ప్రాంతమంతా బురదమయం అవుతోంది. ప్రయాణానికి పాట్లు తప్పవు. ఇక రానున్నది వర్షాకాలం కావడంతో మరిన్ని అవస్థలు పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయాలని విన్నవిస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. ఇప్పటికే వారంలో సదరు పనులు మొదలుపెట్టాలని ఆదేశించామని తెలిపారు. త్వరగా పూర్తిచేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ