భూసమస్యలపై ఏకరవు...
భూ సమస్యలను పరిష్కరించాలంటూ అత్యధికులు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని అర్జీదారులు పాలనాధికారి ఎదుట ఏకరవు పెట్టారు.
ప్రజావాణిలో 44 అర్జీలు
వినతులు స్వీకరిస్తున్న పాలనాధికారి హరీష్, అదనపు పాలనాధికారి రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్
మెదక్, న్యూస్టుడే: భూ సమస్యలను పరిష్కరించాలంటూ అత్యధికులు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని అర్జీదారులు పాలనాధికారి ఎదుట ఏకరవు పెట్టారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో పాలనాధికారి హరీష్, అదనపు పాలనాధికారి రమేశ్ తదితరులు అర్జీలను స్వీకరించారు. మొత్తం 44 రాగా అందులో 26 భూసమస్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రజావాణికి ఆయా శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై పాలనాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే ముందస్తు అనుమతి తీసుకోవాలని, కిందిస్థాయి సిబ్బందిని పంపరాదని సూచించారు. ఇప్పటిదాకా 172 అర్జీలతో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో 61, తహసీల్దార్ల స్థాయి 152, మండల పరిషత్తు స్థాయిలో 115 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించేదుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేష్, జిల్లా అధికారులు శ్రీనివాస్, తరుణ్కుమార్, గంగయ్య, జయరాజ్, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్రావు, కేశురాం, ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, ఏవో మన్నన్ పాల్గొన్నారు.
కొన్ని ఇలా... * చిలప్చెడ్ మండలం సీలంపల్లిలో కాళేశ్వరం కాలువను నిర్దేశిత ప్రదేశంలో కాకుండా మరోచోట తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. కొందరు రాజకీయ పరపతిని ఉపయోగించి సర్వేనెం.308 మీదుగా వెళ్లకుండా 500 మీటర్ల దూరంలో తవ్వేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అలా చేస్తే అదనంగా ఐదు ఎకరాల భూమి కోల్పోతామని వారు వాపోయారు.
* పెద్దశంకరంపేట మండలం సురారం శివారులోని సర్వే నెం. 351లో యాభై ఏళ్లుగా వందలాది మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. 1992లో రెవెన్యూశాఖ అధికారులు పట్టా ఇచ్చారు. ఆ భూములు అటవీశాఖకు చెందినవి గెజిట్లో పేర్కొన్నారని, క్షేత్ర పరిశీలన చేసి తగిన న్యాయం చేయాలని రైతులు విన్నవించారు.
వీఆర్వో తప్పిదంతో భూమి కోల్పోయా..
- బాలయ్య, అబ్లాపూర్, పాపన్నపేట
గ్రామంలోని సర్వేనెం.60లో ఏడు గుంటలు భూమి చీకోటి బీరయ్య పేరిట నమోదైంది. కొత్తగా పాస్పుస్తకం అందజేసిన సమయంలో వీఆర్వో చేసిన తప్పిదంతో ఇలా జరిగింది. కొన్నేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టు తిరుగుతున్నా పరిష్కరించలేదు.
పూర్తి పరిహారం చెల్లించడం లేదు..
- ఆనంద్, కొండాపూర్, మనోహరాబాద్
గ్రామంలోని సర్వేనెం.129, 129/ఓలోని రెండు ఎకరాల పట్టా భూమిని కొన్నేళ్ల కిందట ప్రభుత్వ సేకరించింది. ఇందుకుగాను ఎకరాకు రూ.10.50 లక్షలు చొప్పున, మొత్తం రూ.21 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు అధికారులు రూ.14.70 లక్షలే ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.