చిరుగు..తరుగు..!
జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అన్నదాతలకు సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల కేంద్రాలకు చిరిగిన గన్నీ సంచులు రావటంతో నిర్వాహకులు వాటికే కుట్లు వేసి నింపుతున్నారు. వడ్లు కారిపోతున్నాయంటూ....
అధ్వాన సంచులతో నష్టం
ధాన్యం తూకమేసినా కోత..
న్యూస్టుడే, గజ్వేల్, మిరుదొడ్డి, హుస్నాబాద్, దుబ్బాక
దుబ్బాకలో కొనసాగుతున్న కొనుగోళ్ల ప్రక్రియ
జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అన్నదాతలకు సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల కేంద్రాలకు చిరిగిన గన్నీ సంచులు రావటంతో నిర్వాహకులు వాటికే కుట్లు వేసి నింపుతున్నారు. వడ్లు కారిపోతున్నాయంటూ అదనంగా తూకం వేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇక కేంద్రాల నిర్వాహకులు గ్రేడు నిర్ణయించి.. ధాన్యం కొనుగోలు చేసి పంపిన తరువాత మిల్లర్లు కొర్రీలు పెట్టి తక్కువ గ్రేడు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 413 కేంద్రాలు ఏర్పాటు చేసి.. సోమవారం నాటికి 1,21,544 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా వడ్లకు సంబంధించిన నగదు సకాలంలో ఖాతాల్లో జమ కావటం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.136 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికి రూ.36 కోట్లు చెల్లించారు.
రుద్రారంలో చిరిగిన గన్నీ సంచిని చూపుతున్న రైతు
* గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తోల శ్రీనివాస్రెడ్డి 570 బస్తాల ధాన్యం విక్రయించారు. నిర్వాహకులు ఏగ్రేడు (క్వింటాలుకు రూ.1980)గా పరిగణించి చీటీ రాసిచ్చారు. రైస్మిల్లు వద్దకు పోయిన తరువాత ధాన్యం మంచిగా లేదని... బీ గ్రేడుగా తీసుకుంటామన్నారు. క్వింటాలుకు రూ.20 తగ్గించారు. మొత్తంగా రూ.6వేలు రైతు నష్టపోయాడు.
* మిరుదొడ్డి మండల పరిధి రుద్రారం గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి చిరిగిపోయిన గన్నీ సంచులు వచ్చాయి. వాటికి కుట్లు పెడుతూ ధాన్యం నింపుతున్నారు. ఈ క్రమంలో ధాన్యం కారిపోతుందని చెప్పి బస్తాకు 41 కిలోలకు బదులు అదనంగా మరో 300 గ్రామల నుంచి కిలో వరకు ఎక్కువ నింపుతున్నారు. అలాగైతేనే కాంటా వేస్తామని చెప్పటంతో చేసేదేమీలేక రైతులు తరుగు భరిస్తున్నారు.
* దుబ్బాకలోని కొనుగోలు కేంద్రంలోనూ చిరిగిన సంచుల్లో నింపుతున్నారు. 41 కిలోలకు అదనంగా తూకం వేస్తున్నారు. గజ్వేల్ పరిధిలోని పలు కేంద్రాల్లో తూర్పార యంత్రాలు మొరాయించటంతో ఒక్కో బస్తా 43.5 కిలోలు నింపుతూ 41 కిలోలుగానే పరిగణిస్తున్నారు.
బీగ్రేడుగా తీసుకుంటున్నారు
- కృష్ణారెడ్డి, రైతు
తూకం వేసే సమయంలో ఏ గ్రేడుగా చెప్ఫి. మిల్లులో బస్తాలు దించే సమయంలో బీగ్రేడుగా పరిగణిస్తున్నారు. లేదంటే వెనక్కు పంపిస్తామంటున్నారు. చేసేది ఏమీలేక అంగీకరిస్తున్నాం.. దీంతో నష్టపోవాల్సి వస్తోంది.
ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం..
- హరీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి
ధాన్యం రకాల కారణంగా గ్రేడులో మార్పు చేస్తున్నట్లుంది. కొనుగోలు సమయంలోనే గుర్తించాలని చెబుతున్నాం. కొన్ని చోట్ల ఈ సమస్య ఉత్పన్నమైనా పరిష్కరించాం. కొన్ని కేంద్రాలకు చిరిగిన సంచులు వస్తున్నాయి. వాటిని మార్చి కొత్తవి పంపిస్తాం. అదనంగా తూకం వేయడం తగదు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం. పెండింగ్లో ఉన్న రూ.100 కోట్లను నాలుగైదు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తాం. వచ్చేనెల 20 లోపు కొనుగోళ్లు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా