ఆధునిక సేవలకు ఊతం!
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆసుపత్రిలో అనేక రకాల చికిత్సలు అందిస్తున్న విషయం తెలిసిందే.
సిద్దిపేటలో రేడియాలజీ విభాగం అందుబాటులోకి..
న్యూస్టుడే, సిద్దిపేట
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆసుపత్రిలో అనేక రకాల చికిత్సలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్కు అనుబంధంగా రేడియాలజీ విభాగం ప్రారంభానికి సిద్ధమైంది. గత ఏడాది ఈ విభాగం మంజూరవగా.. హబ్కు వెనుక వైపు భవనం సుందరీకరణ, అందులో యంత్రాలు, పరికరాల అమరిక పూర్తయింది. నేడు (మంగళవారం) వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రేడియాలజీ విభాగం సేవలు సిద్దిపేట నుంచే తొలిగా అందుబాటులోకి రానుండటం విశేషం. ప్రైవేటు దవాఖానాల్లో చిన్నపాటి పరీక్ష చేయాలంటే రూ.100 మొదలు రూ.వేలల్లో ఖర్చవుతోంది. ఈ తరుణంలో గత ఏడాది ఫిబ్రవరిలో సిద్దిపేటలో అందుబాటులోకి వచ్చిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్.. పేదలకు ‘వైద్య’ భారాన్ని తగ్గిస్తోంది. ఈ కేంద్రం ద్వారా 59 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిత్యం సగటున 500 నుంచి 600 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలు, యంత్రాల ద్వారా 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన రక్త, మూత్ర, ఇతర నమూనాలను ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. ఈ కేంద్రానికి అనుసంధానంగా నూతనంగా రేడియాలజీ విభాగం ఏర్పాటు చేశారు. ఈ మేరకు రూ.కోటి వెచ్చించారు. వైద్య కళాశాల నుంచి డిప్యూటేషన్పై ఆరుగురు వైద్యులు, సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు.
ఐదు రకాల పరికరాలు..
రేడియాలజీ విభాగం ద్వారా పలు పరికరాలు, ఉపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. అల్ట్రా సౌండ్ స్కాన్, 2డీ ఎకో, ఈసీజీ, ఎక్స్రే, మమోగ్రామ్ (రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ) పరికరాలు ఏర్పాటయ్యాయి. ఆయా పరీక్షలు ప్రైవేటుగా చేయించుకోవాలంటే కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 42 ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వైద్యుల సూచన (రిఫర్) మేరకు సంబంధిత సేవలు అందించనున్నారు. గ్రామీణ, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఉపయుక్తంగా మారనుంది. కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుబాటులోకి రానుందని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.