అర్జీలతో సరి.. ఆశలు ఆవిరి!
నాలుగేళ్లుగా యువత నిరీక్షణ
బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాల తీరు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే దీనికి కారణం. బీసీ యువతకు పథకాల అమలు మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తు చేసిన వారి ఆశలు ఆవిరవుతున్నాయి. 2017-18కి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వీకరించిన అర్జీలకు ఇప్పటికీ మోక్షం లభించడంలేదు. జిల్లా జనాభా 15.27లక్షలు. ఇందులో అత్యధికంగా బీసీలే. ఆయా వర్గాలకు చెందిన కులవృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేక ఉపాధికి దూరమై అవస్థలు పడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయితీ రుణాలకు దరఖాస్తు చేసినా సాయం అందకపోవడంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోలేకపోతున్నారు.
‘శతశాతం’ కొందరికే: గతంలో ఎప్పుడూ లేనివిధంగా రూ.లక్షలోపు యూనిట్లకు అర్జీ చేసుకున్న వారికి శతశాతం రాయితీ కింద రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదలచేసింది. చిరు వ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 766 యూనిట్లకు రూ.3.83కోట్లు అందజేశారు.
రూ.లక్ష ఆపై యూనిట్లకు నిరాశే: రూ.లక్షలోపు యూనిట్లను కేటగిరి-1, రూ.రెండు లక్షలలోపు యూనిట్లను కేటగిరి-2, రూ.2లక్షలకు పైగా యూనిట్లను కేటగిరి -3గా నిర్ణయించారు. రూ.లక్ష ఆపై యూనిట్లకు అర్జీ చేసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. రాయితీ రుణాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంపై నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తంచేస్తోంది.
పరిశీలనలేదు.. ముఖాముఖికి పిలవరు
రాయితీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 10,047 మంది దరఖాస్తు సమర్పించారు. ఇందులో ఎంతమంది అర్హులని తేల్చలేదు. పరిశీలించి ముఖాముఖి నిర్వహించాల్సి ఉండగా నాలుగేళ్లుగా అదీ ముందుకుసాగని పరిస్థితి. దరఖాస్తుల స్వీకరణకు అనుమతించి, తదుపరి ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసమని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపుతోనే యూనిట్ల గ్రౌండింగ్కు మార్గం సుగమం అవుతుంది. పాతవారికే అందకపోవడంతో కొత్త వారికి అవకాశం లేకుండాపోయింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు సైతం స్వీకరించని పరిస్థితి.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
జగదీశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి
బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకుసాగుతాం. యూనిట్ల మంజూరు, రాయితీ విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే యూనిట్ల గ్రౌండింగ్కు చర్యలు తీసుకుంటాం. అర్హులందరికీ అందే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్పై రామ్ ట్వీట్
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు సజీవదహనం