అర్జీలతో సరి.. ఆశలు ఆవిరి!
యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే దీనికి కారణం. బీసీ యువతకు పథకాల అమలు మూడు అడుగులు ముందుకు..
నాలుగేళ్లుగా యువత నిరీక్షణ
బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాల తీరు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే దీనికి కారణం. బీసీ యువతకు పథకాల అమలు మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తు చేసిన వారి ఆశలు ఆవిరవుతున్నాయి. 2017-18కి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వీకరించిన అర్జీలకు ఇప్పటికీ మోక్షం లభించడంలేదు. జిల్లా జనాభా 15.27లక్షలు. ఇందులో అత్యధికంగా బీసీలే. ఆయా వర్గాలకు చెందిన కులవృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేక ఉపాధికి దూరమై అవస్థలు పడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయితీ రుణాలకు దరఖాస్తు చేసినా సాయం అందకపోవడంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోలేకపోతున్నారు.
‘శతశాతం’ కొందరికే: గతంలో ఎప్పుడూ లేనివిధంగా రూ.లక్షలోపు యూనిట్లకు అర్జీ చేసుకున్న వారికి శతశాతం రాయితీ కింద రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదలచేసింది. చిరు వ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 766 యూనిట్లకు రూ.3.83కోట్లు అందజేశారు.
రూ.లక్ష ఆపై యూనిట్లకు నిరాశే: రూ.లక్షలోపు యూనిట్లను కేటగిరి-1, రూ.రెండు లక్షలలోపు యూనిట్లను కేటగిరి-2, రూ.2లక్షలకు పైగా యూనిట్లను కేటగిరి -3గా నిర్ణయించారు. రూ.లక్ష ఆపై యూనిట్లకు అర్జీ చేసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. రాయితీ రుణాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంపై నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తంచేస్తోంది.
పరిశీలనలేదు.. ముఖాముఖికి పిలవరు
రాయితీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 10,047 మంది దరఖాస్తు సమర్పించారు. ఇందులో ఎంతమంది అర్హులని తేల్చలేదు. పరిశీలించి ముఖాముఖి నిర్వహించాల్సి ఉండగా నాలుగేళ్లుగా అదీ ముందుకుసాగని పరిస్థితి. దరఖాస్తుల స్వీకరణకు అనుమతించి, తదుపరి ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసమని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపుతోనే యూనిట్ల గ్రౌండింగ్కు మార్గం సుగమం అవుతుంది. పాతవారికే అందకపోవడంతో కొత్త వారికి అవకాశం లేకుండాపోయింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు సైతం స్వీకరించని పరిస్థితి.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
జగదీశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి
బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకుసాగుతాం. యూనిట్ల మంజూరు, రాయితీ విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే యూనిట్ల గ్రౌండింగ్కు చర్యలు తీసుకుంటాం. అర్హులందరికీ అందే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్