25 ఎకరాలు.. 11వేల మొక్కలు
అటవీ రక్షణకు సంబంధిత శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఖాజీపల్లి బీట్లోని కిష్టాయపల్లి అడవిలో ఇప్పటికే నటుడు ప్రభాస్ వితరణ చేసిన రూ.2 కోట్ల పనులు కొలిక్కి వస్తున్నాయి.
కిష్టాయపల్లి అడవిలో నాటేందుకు ఏర్పాట్లు
న్యూస్టుడే, జిన్నారం
అటవీప్రాంతంలో చేపట్టిన చదును పనులు..
అటవీ రక్షణకు సంబంధిత శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఖాజీపల్లి బీట్లోని కిష్టాయపల్లి అడవిలో ఇప్పటికే నటుడు ప్రభాస్ వితరణ చేసిన రూ.2 కోట్ల పనులు కొలిక్కి వస్తున్నాయి. గతంలో రింగురోడ్డులో కోల్పోయిన భూమికి పరిహారంగా ఇక్కడ కేటాయిచిన 17 హెక్టార్లలోనూ అటవీ సంపదను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి తోడు క్రమంగా అంతరించిపోతున్న అటవీ మొక్కలను కాపాడుకునేందుకు తాజాగా కిష్టాయపల్లి అడవిలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు పనులు చేపట్టిన నేపథ్యంలో కథనం.
పారిశ్రామికవాడ ఆనుకొని..
అడవుల్లోని కలప తరిగిపోతోంది. చిరు అడవులు కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జిన్నారం మండలం కిష్టాయపల్లి శివారులో.. అటు గడ్డపోతారం పారిశ్రామికవాడను.. ఇటు ఖాజీపల్లి అడవిని ఆనుకొని ప్లాంటేషన్ సిద్ధమవుతోంది. ప్రధానంగా అల్లనేరేడు, వేప, ఇప్ప, మొర్రి, నెమలినార, మారేడు, వెలగ, చీమచింతకాయ, రావి, మర్రి, జువ్వ, చింత, పనస, మద్ది, నల్లమద్ది, వాగుమద్ది తదితర మొక్కలను తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. కిష్టాయపల్లి అడవిలోని 25 ఎకరాల్లో 11వేల వరకు మొక్కలు నాటుతామని సంబంధిత శాఖాధికారులు ‘న్యూస్టుడే’కు వివరించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు భూమిని చదును చేశారు. పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. మొక్కలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నర్సరీల నుంచి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని కాపాడేందుకు కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేయనున్నారు.
కాలుష్యం నుంచి ఉపశమనానికి..
నగర శివారులోని చిల్కూరు వద్ద అటవీ ప్రాంతం రింగురోడ్డులో పోగా.. దానికి పరిహారంగా ఖాజీపల్లిలో 17 హెక్టార్లను కేటాయించారు. ఆయా అటవీ ప్రాంతాన్ని కొన్నేళ్లుగా అభివృద్ధి చేసి. రకరకాల మొక్కలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నగరానికి సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది. వాచ్టవర్, నడక బాటలు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ప్రముఖులు ఇక్కడికి తరచూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెలవు దినాల్లో అటవీ ప్రాంతం భవిష్యత్తులో కిక్కిరిసి పోనుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో స్థానిక పారిశ్రామిక వాడల వల్ల నిత్యం వెలువడుతున్న కాలుష్యం నుంచి కొంతవరకైనా ఉపశమనం కలుగనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కిష్టాయపల్లిలో చదును పనులు జరుగుతున్నాయని, మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నామని అటవీశాఖ రేంజి అధికారి వీరేంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!