సాగుకు బాసట.. పంచసూత్రాలు
ఇప్పటికే యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికొచ్చాయి. కర్షకులు దిగుబడులను మార్కెట్కు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐదు అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా వివరాలు ఇలా..
భూసారం పెరిగేలా..
ఏళ్లుగా రసాయనాల వాడకంతో భూమి సారం కోల్పోతుంది. భూమిలో సేంద్రియ కర్బనం తగ్గుతుండటంతో పంటను చీడపీడలు ఆశిస్తున్నాయి. వాటి నుంచి సంరక్షణకు పచ్చిరొట్ట దోహదపడుతుంది. జనుము, జీలుగ, పిల్లి పెసర, నవధాన్యాలు వంటివి సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. 65 శాతం రాయితీపై అందిస్తున్నారు.
పీఎస్బీ వాడకం..
పంటకు కావాల్సిన ప్రధాన పోషకాల్లో భాస్వరం ఒకటి. భూమిలో పేరుకుపోయిన కాంప్లెక్సు, సూపర్ పాస్ఫెట్, డీఏపీని తిరిగి అందించేందుకు ఫాస్పరస్ సొల్యూబలైజింగ్ బ్యాక్టీరియా తోడ్పడుతుంది. ఎకరాకు 30 కిలోల పశువుల పేడలో, 2 కిలోల బెల్లం, 350 మి.లీ. పీఎస్బీని కలిపి వారం పాటు మాగబెట్టి పిచికారీ చేస్తే మేలు.
లాభాలు వచ్చేలా..
మన దగ్గర పండే పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగును ప్రయోగాత్మకంగా చేపడితే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఇక పప్పు దినుసులకు మార్కెట్లో మద్దతు ధర అధికంగా ఉంది. ఈ మేరకు ఆయా వాటి సాగుకు ప్రోత్సహించనుంది.
సమగ్ర యాజమాన్యం..
వరి సాగులో మెలకువలు పాటిస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ విధానం మేలైనవి. కూలీల ఖర్చు తగ్గడంతో పాటు తొలకరి వానలకే షురూ చేసుకోవచ్ఛు పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.8 వేల వరకు తగ్గుతుంది. వెద పద్ధతిలో మొక్కలు, వరుసల మధ్య దూరం ఉండటం వల్ల గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడలు ఆశించవు.
మెలకువలు పాటిస్తే..
పంటకాలంలో ఎరువులు ఒకేసారి చల్లడం మంచిది కాదు. అలా కాకుండా పలు దఫాలుగా వాడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొక్కలకు నేరుగా అందడమే కాకుండా వృథా తగ్గుతుంది. పోషకాలు మొక్కకు నేరుగా అందడం వల్ల, ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది.
నాణ్యతే ప్రధానం
మామిడి కోతలో రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే విపణిలో మంచి ధర లభిస్తుందని ఉద్యాన శాఖ అధికారి భాస్కర్రెడ్డి తెలిపారు. ఇప్పటికే మామిడి కోతలు ఆరంభమయ్యాయి. చాలా ప్రాంతాల్లో బంగినినపల్లి 50 శాతం కోతలు పూర్తవగా, దసేరి కోత దశలో ఉంది. మార్కెట్లో మంచి ధర రావాలంటే కాయల నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జీడి అంటకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. కోసేటప్పుడు కాయకు ఒక అంగుళం తొడిమ ఉండేలా చూసుకోవాలి.
- న్యూస్టుడే, నంగునూరు
ఆయిల్పామ్ రైతులకు ‘బిందు’ రాయితీ
ఆయిల్పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తాజాగా రాయితీ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని ఉద్యాన శాఖ జిల్లా అధికారిణి రామలక్ష్మీ తెలిపారు. బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందించనుంది. పట్టాపాసుపుస్తకం, 1బీ పత్రం, ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం, ఫొటోతో సహా దరఖాస్తు చేయాలి. ఉద్యాన అధికారికి సైతం ఆయా పత్రాలు ఇవ్వాలి.
రాయితీ: ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం 100 శాతం రాయితీపై అందిస్తుంది. జీఎస్టీ మాత్రం చెల్లించాలి. సన్న, చిన్నకారు (ఐదు ఎకరాల్లోపు) రైతులకు 90 శాతం రాయితీ లభిస్తుంది. పెద్ద రైతులకు (ఐదు ఎకరాలకు పైగా) 80 శాతం రాయితీ. ఒక్కొక్కరికి 5 హెక్టార్ల వరకు మాత్రమే రాయితీ అందిస్తారు. వివరాలకు ‘టీఎస్ఎంఐపీ’ వెబ్సైట్లో సంప్రదించాలి.
- న్యూస్టుడే, చేర్యాల
సమయం స్వల్పం.. ఆదాయం అధికం
అతడో సాధారణ రైతు. మార్కెట్కు అనుగుణంగా పంటలు పండిస్తూ లాభాలు ఆర్జించడంలో మాత్రం దిట్ట. ఆయనే గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అజీజ్. ఈయనకు రెండెకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనంలోనే సాగుపై మక్కువ ఏర్పడింది. తండ్రికి చేదోడుగా ఉండి మెలకువలు నేర్చుకున్నారు. కాలానికి అనుగుణంగా ఏ పంటకు మంచి ధర పలుకుతుందో బేరీజు వేసుకుని సాగు చేస్తుంటారు. కౌలుకు తీసుకున్న భూమిలో వరి వేశారు. ఇక తన సొంత పొలంలో రెండు నెలల కిందట బెండ తోట వేశారు. ఉద్యాన అధికారుల సూచనల ప్రకారం అడుగేశారు. తెగుళ్లు రాకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. విత్తనాల దగ్గరి నుంచి కలుపు నివారణ, తదితర వాటికి రూ.30 వేల వరకు ఖర్చయింది. ఇప్పటి వరకు 2 కాతల పంట చేతికొచ్చింది. దిగుబడులను విక్రయించగా.. రూ.85 వేల వరకు వచ్చింది. ఖర్చులన్నీ పోగా రూ.55 వేలు మిగిలాయి. మరో 8 కాతల వరకు పంట వచ్చే అవకాశం ఉంది. ఇదంతా లాభాల పంటే. కూరగాయల సాగుతో తక్కువ పెట్టుబడితో అనుకున్న స్థాయిలో లాభాలు రావడం ఖాయమని చెబుతున్నారీ రైతు.
- న్యూస్టుడే, గుమ్మడిదల
ప్రశ్న.. సమాధానం..
ప్రశ్న: తీగజాతి కూరగాయల్లో పండు ఈగ నివారణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- సక్రి, హత్నూర
సమాధానం: మలాథియాన్ 2 మి.లీ. లేదా ప్రొఫినోపాస్ 2 మి.లీ... ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.
-బాల్రెడ్డి, ఏవో, చిలప్చెడ్
-న్యూస్టుడే, చిలప్చెడ్
సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 94938 40360
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్