ఉపాధికి మార్గం... భవితకు ఊతం
నవ భారత్..కొత్త అవసరాలు..ఆధునిక సమృద్ధి..ఈ నినాదాలతోనే కేంద్రం ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఐటీఐ విద్యార్థులకు ఇది వరంలా మారనుంది.
ఐటీఐ విద్యార్థులతో అప్రెంటిస్షిప్ మేళాలు
నెలకోసారి నిర్వహణకు ఉత్తర్వులు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
నవ భారత్..కొత్త అవసరాలు..ఆధునిక సమృద్ధి..ఈ నినాదాలతోనే కేంద్రం ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఐటీఐ విద్యార్థులకు ఇది వరంలా మారనుంది. ఈ మేళాల ద్వారా ఐటీఐ విద్యార్థులు కోర్సు పూర్తికాగానే తమకు నచ్చిన కంపెనీలో అప్రెంటిస్షిప్లో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రతినెలా మేళాలు ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో కథనం.
ఏర్పాటు ఉద్దేశం నెరవేరేలా..
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దక్కేలా చేయాలన్న ఉద్దేశంతో పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. జీవితంలో వెంటనే స్థిరపడాలనుకునే విద్యార్థులు ఐటీఐ కోర్సులనే ఎంపికచేసుకుంటున్నారు. పూర్తికాగానే అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది.
ఎదురుచూపులకు చెల్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 35 ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఏడు. సంగారెడ్డి, సిద్దిపేటలో మూడు చొప్పున ఉండగా మెదక్లో ఒకటి మాత్రమే ప్రభుత్వ ఐటీఐ ఉండటం గమనార్హం. వీటిలో చదువున్న విద్యార్థులు 18వేల మంది. ప్రతి సంవత్సరం కోర్సు పూర్తిచేసుకునే వారు 5వేల మందికి పైగా ఉంటారు. వీరు అప్రెంటిస్షిప్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల పిలుపుకోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పరిశ్రమలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించినా ఒక్కోసారి ఫలితం ఉండటంలేదు. ఇదే సమయంలో కొన్ని పరిశ్రమలకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇలాంటి తరుణంలో అభ్యర్థులు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు రూపొందించిన ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలు ఇద్దరి సమస్యను తీర్చనున్నాయి.
ఆధునిక యంత్రాలపై పట్టు
మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమ యాజమాన్యాలు భారీ ఉత్పత్తులు, పెట్టుబడి వ్యయం నియంత్రణ, లాభాల పెంపు లక్ష్యంగా ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఐటీఐ కళాశాలల్లో ఇందుకు అనుగుణంగా యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. అప్రెంటిస్షిప్లో చేరే విద్యార్థులకు యంత్రాల వినియోగంపై అవగాహన పెరుగుతుంది.
మంచి అవకాశం : రాజేశ్వరరావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ ఐటీఐ, సంగారెడ్డి
ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మేళాలు నిర్వహించాలని ఉత్తర్వులు వచ్చిన మాటవాస్తవమే. ఐటీఐ పూర్తిచేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్రెంటిస్షిప్ కోసం గతంలో పరిశ్రమల చుట్టూ తిరగాల్సివచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మేళాకు పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతూ ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్నారు.
వివరాలు.. ఇలా..
జిల్లా కళాశాలలు
ప్రభుత్వ ప్రైవేటు
సంగారెడ్డి 03 15
మెదక్ 01 06
సిద్దిపేట 03 07
వికారాబాద్ 01 02
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?