క్వారీల నిర్వాకం.. పేలుళ్ల భయం
క్వారీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాన్ని దుమ్ము కమ్మేయడంతో పాటు.. రసాయనాల ఘాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
న్యూస్టుడే, జిన్నారం
ఖాజీపల్లి గ్రామాన్ని కమ్మేసిన దుమ్ము
క్వారీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాన్ని దుమ్ము కమ్మేయడంతో పాటు.. రసాయనాల ఘాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిన్నారం మండల పరిధిలోని పలు కంకర క్వారీల నిర్వాహకుల తీరుతో ఎదురవుతున్న ఇక్కట్లివి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లి, మాదారం, మంత్రికుంట, కొర్లకుంట గ్రామాలకు కంకర క్వారీల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్న తీరుపై కథనం.
ఇళ్లకు బీటలు...
క్వారీల వద్ద నిర్వహించే పేలుళ్ల వల్ల సమీపంలోని పంట పొలాలు రాళ్లతో నిండిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు కూరుకుపోవడం, తెల్లటి రాతి పొడి గ్రామాలపై పొగలా చేరుతోంది. దీనికి తోడు రసాయనాల ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లిలో వారం వ్యవధితో రెండుసార్లు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొన్నారు. మంత్రికుంట, మాదారంవాసులదీ నిత్యం ఇదే దయనీయ పరిస్థితి. పేలుళ్ల కోసం వినియోగించే సామగ్రిలో రసాయనాలు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. పేలుళ్ల వ్యవహారం తమ పరిధిలోకి రాదని అంటున్నారని పలువురు తెలిపారు. మండలంలోని రాళ్లకత్వ, శివానగర్, దాదిగూడెంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది.
అధిక సామర్ధ్యం వల్లనే...
క్వారీల నిర్వాహకులు పరిమితికి మించి మందు గుండును వినియోగిస్తున్నారు. తవ్వకాల కోసం కొన్ని అడుగుల లోతు వరకు రంధ్రాలు చేసే యంత్రాలున్నాయి. ఇందులో అమ్మోనియంతోపాటు.. మూడు రకాల రసాయన పదార్థారాలు వినియోగిస్తున్నారు. దీంతో అధిక సామర్ధ్యం పేలుళ్లు జరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటీవల మాదారం, రాళ్లకత్వ శివారులో నూతనంగా ఏర్పాటు చేసే క్వారీలను గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారంటే.. క్వారీల నిర్వాహకుల తీరును అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో రసాయన పరిశ్రమల ప్రభావం కంటే క్వారీల సమస్య అధికమవుతోందనే ఆరోపణలున్నాయి. చాలా క్వారీలు పలుకుబడి కలిగిన నేతలవే కావడంతో అధికారులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలున్నాయి. మండల సర్వసభ్య సమావేశం, జిల్లా పరిషత్ సమావేశాల్లో పలు పర్యాయాలు క్వారీల నిర్వహణ తీరుపై చర్చలు జరిగినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. ఇకనైనా సమస్య పరిష్కారానికి వివిధ విభాగాల అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
దుమ్ము మాత్రమే మా పరిధి...: - రవికుమార్, పీసీబీ ఈఈ
క్వారీల వల్ల వచ్చే దుమ్ము మాత్రమే మా పరిధిలోకి వస్తుంది. బ్లాస్టింగ్ విషయాన్ని మైనింగ్ శాఖ చూసుకుంటుంది. గాలిలో దుమ్ము ఎంత మేరకు కలుస్తోంది.. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న తీరుపై విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
యాజమాన్యాలను హెచ్చరించాం..: రమేశ్, ఆర్ఐ, మైనింగ్ శాఖ
క్వారీల్లో పేలుళ్ల సమస్య మా దృష్టికి వచ్చింది. సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించాం. నిబంధనలు పాటించాలని స్పష్టం చేశాం. లేదంటే మూసేయాలని ఆదేశించాం. కొత్తరకం బ్లాస్టర్ల వల్ల ఇలా జరిగిందని చెప్పారు. సమస్య పునరావృతం కాదని హామీ ఇచ్చారు. నిఘా ఏర్పాటు చేసి.. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్