కరెంటు కోతలు.. వినియోగదారుల వెతలు!
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. తరచూ ఏర్పడుతున్న విద్యుత్తు అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎంతసేపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి తయారైంది. వానకాలం
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలికలో అస్తవ్యస్తంగా సరఫరా
న్యూస్టుడే, గజ్వేల్
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. తరచూ ఏర్పడుతున్న విద్యుత్తు అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎంతసేపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి తయారైంది. వానకాలం రాకతో విద్యుత్తు వినియోగం తగ్గినా కోతలు ఎందుకుంటున్నాయనే ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయత్రం కరెంటు కోతలు తీవ్రంగా ఉంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. 24 గంటలు విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. బల్దియాలో రోజూ కరెంటు పోతోంది. సాయంత్రం నాలుగు దాటిందంటే కోతులు షురూ అవుతున్నాయి. ఒక్కోసారి గంటల తరబడి రావడం లేదు. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ (వినియోగదారులు ఫోన్ ద్వారా తెలిపే) సమస్యలు తీర్చుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. రోజూ సమస్యలు తీర్చుతుంటే కరెంటు ఎందుకు పోతోందంటున్నారు. పురపాలికలో దాదాపు 55 వేల జానాభా ఉంది. దాదాపు 15 వేల గృహ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. 5 వేల దుకాణాలు, మరో 50 వరకు వివిధ చిన్న, మధ్యతరహా పరిశ్రమల కనెక్షన్లున్నాయి. అప్రకటితంగా కరెంటు కోతలు విధించటం వల్ల వినియోగదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిరాక్సు, ఎక్స్రే కేంద్రాలు, ఫొటో స్టూడియోలు, హోటళ్ల వ్యాపారాలు సాగటం లేదు. జనరేటర్లు, ఇన్వర్టర్లు వినియోగించే వారికి ఖర్చు అదనపు భారమవుతోంది. నిత్య రాబడిలో డీజిల్కు రూ.200 వరకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. జీపీ బల్దియాకు విద్యుత్తు సరఫరా చేసేందుకు గజ్వేల్లోని 33 కేవీ ఉపకేంద్రంతో పాటు ప్రజ్ఞాపూర్లో మరో రెండు ఉపకేంద్రాలున్నాయి.
ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి
గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు విద్యుత్తు సరఫరా అయ్యే తీగలు ఎల్టీ లైన్లతోపాటు హెచ్టీ లైన్లు ఒకే స్తంభానికి ఉండటంతో విద్యుత్తు సమస్యలు ఏర్పడినప్పుడు రెండిటికీ నిలిపేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడినప్పుడు దాని పరిధి వరకే విద్యుత్తు నిలిపేసే వ్యవస్థ రూపొందిస్తే ఇబ్బంది ఉండదు.
లోపాలు లేకుండా చూస్తాం
- ప్రభాకర్, జిల్లా ఎస్ఈ
ప్రభుత్వ సూచన మేరకు విద్యుత్తు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. జీపీ పురపాలికలో కరెంటు కోతలకు కారణాలేంటనే విషయాన్ని పరిశీలిస్తాం. వినియోగదారులకు మెరుగ్గా సరఫరా అయ్యేలా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా