అవగాహన కల్పిస్తూ.. వెదజల్లడం ప్రోత్సహిస్తూ..!
ఈ విధానంలో వరి సాగు లక్ష్యం 20 వేల ఎకరాలు
న్యూస్టుడే, గజ్వేల్
అహ్మదీపూర్లో రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
సేద్యంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను రైతుల దరి చేర్చి.. సాగు ఖర్చులు తగ్గించుకుని.. మంచి దిగుబడులతో లాభాలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వరి సాగులో వెదజల్లే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో ఈ తరహా సాగును అనుసరిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. ఏటా పాతిక శాతం మేర ఈ విధానంలో వరి సాగు చేయిస్తూ.. వచ్చే ఐదేళ్లలో అత్యధిక శాతం మందిని ఈ దిశగా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో గతేడాది నుంచి ఈ తరహా సాగును ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేస్తే రెండు సార్లు దున్నడానికి ఖర్చు రూ.10 వేలు, గొర్రుతో చదును చేస్తే రూ.2 వేలు, నాట్ల ఖర్చు రూ 7500, కూలీల ఇతరత్రా వాటికి సుమారు రూ.20 వేలు వ్యయం చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ విధానంలో సాగు చేస్తే ఎకరాకు 25 నుంచి 26 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. వెదజల్లడం అనుసరిస్తే.. 28 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. చీడపీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
గత సీజన్లో విజయవంతంగా..
గతేడాది 15 వేల ఎకరాల్లో వెదజల్లడం ద్వారా వరి వేయగా వంద శాతం విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ సీజన్లో మొత్తం 5.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. ఇందులో ప్రధానంగా 2.50 లక్షల ఎకరాల్లో వరి వేయనున్నట్లు అంచనా వేశారు.
ఈ విధానం అనుసరిస్తే ప్రయోజనం
- శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తే రైతులకు మంచి లాభాలున్నాయి. పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటే మేలు. ప్రభుత్వం ఈ విధానంపై అవగాహన కల్పిస్తుంది. ఈ ఏడాది జిల్లాలో 20 వేల ఎకరాలకు తగ్గకుండా ఈ విధానంలో వరి సాగు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై సలహాలు, సూచనలు కావాలంటే స్థానికంగా ఉన్న వ్యయసాయ విస్తరణ అధికారులను సంప్రదించవచ్చు. అవసరమైతే క్షేత్రస్థాయిలో సాగు తీరును పర్యవేక్షిస్తారు.
ఐదెకరాల్లో సాగు చేశా..
- రాజిరెడ్డి, అహ్మదీపూర్
నేను గతేడాది ఐదు ఎకరాల్లో వరి వెదజల్లే విధానంలో సాగు చేశా. చీడపీడల బెడద లేదు. ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సారి కూడా ఇదే విధానంలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాం.
ఖర్చు తగ్గింది..
- దేవేందర్రెడ్డి, ధర్మరెడ్డిపల్లి
ఈ విధానంలో వరి సాగు చేస్తే ఎకరాకు రూ.8 వేల చొప్పున రెండెకరాలకు రూ.16 వేల ఖర్చు తగ్గింది. దిగుబడి 28 క్వింటాళ్లు వచ్చింది. కూలీల ఇబ్బంది లేకుండా సమయానికి విత్తనం వేశా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth reddy: సమస్యలపై మునుగోడులో చర్చ జరగాలి.. వ్యక్తిగత దూషణలు వద్దు: రేవంత్
-
Sports News
Bumrah : బుమ్రా అసాధారణ బౌలింగ్ యాక్షన్ వల్లే ఎక్కువగా గాయాలు
-
Movies News
Liger: మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్ మీట్.. వేదిక మార్చేసిన టీమ్
-
Sports News
Dravid - Taylor : అడవిలో 4000 పులులు .. కానీ ఇక్కడ ద్రవిడ్ మాత్రం ఒక్కడే!
-
India News
RSS chief: యావత్ ప్రపంచం భారత్వైపే చూస్తోంది : మోహన్ భగవత్
-
Movies News
Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- RRR: ఆస్కార్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)