‘ప్రైవేటుకు మిన్నగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు’
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు కన్నా మిన్నగా వైద్య సేవలు అందిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన
ఆసుపత్రిలో ఆహారాన్ని పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తదితరులు
హుస్నాబాద్, హుస్నాబాద్ గ్రామీణం: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు కన్నా మిన్నగా వైద్య సేవలు అందిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో వ్రైద్య సేవలు మెరుగపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. బాలింతకు కేసీఆర్ కిట్ అందచేశారు.
గండిపల్లి ప్రాజెక్టు పనులు చేపడుతాం..
గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తయిన వెంటనే గండిపల్లి ప్రాజెక్టు పనులు చేపడుతామని హుస్నాబాద్ ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం అక్కన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. గండిపల్లి ప్రాజెక్టుకు ఎలాంటి భూ సేకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం 11 ఇళ్లు మాత్రమే మునిగిపోతాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును నీటితో నింపిన తర్వాత అక్కడి నుంచి గండిపల్లికి సరఫరా చేస్తామన్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగవద్దని, వారికి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకే కాలువల ద్వారా నీరందించాలనేది తమ ఆలోచన అన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంతో పాటు మానవతా దృక్పథంతో తాజా మేజర్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.
క్రీడల్లో రాణించేందుకు ప్రాంగణాలు
గ్రామీణ విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అక్కన్నపేట మండలం పోతారం(జె)లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడారు. ఖోఖో, వాలీబాల్, షటిల్, కబడ్డీ మైదానాలు బాగున్నాయని సర్పంచిని అభినందించారు. కొద్దిసేపు షటిల్, వాలీబాల్ ఆడారు. మొక్కలు నాటారు. అక్కన్నపేట రైతువేదికలో కల్యాణలక్ష్మి పథకం కింద 106 మందికి రూ.1.06 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, పుర అధ్యక్షురాలు రజిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్