‘అన్ని రంగాల్లో గజ్వేల్ అభివృద్ధి’
తరతరాలుగా వెనకబాటుకు గురైన గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ కృషితో దశ, దిశ మారి అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారిందని గజ్వేల్ నుంచి ఆయనను తప్ప మరొకరని ఇక్కడి ప్రజలు ఊహించుకోరని గజ్వేల్ ఏఎంసీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్, న్యూస్టుడే: తరతరాలుగా వెనకబాటుకు గురైన గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ కృషితో దశ, దిశ మారి అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారిందని గజ్వేల్ నుంచి ఆయనను తప్ప మరొకరని ఇక్కడి ప్రజలు ఊహించుకోరని గజ్వేల్ ఏఎంసీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన గజ్వేల్లోని ఏఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తెలంగాణ ముఖచిత్రంలో నిలిపిన ఘనత కేసీఆర్ది అన్నారు. గతంలో కనీసం తాగునీళ్లకు నోచుకోని గజ్వేల్ ఈ రోజు ప్రగతి పథంలో దూసుకుపోతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయోగశాలగా మారిందన్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం వల్లనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఇక్కడ అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్, భాజపా నేతలు కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయబోరని, సత్యదూర ప్రచారం చేయటం సహించరానిదన్నారు. సాధ్యమే కాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ్ల అభివృద్ధిలో దేశంలోనే ఆగ్రగామిగా నిలిపిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ పగటి కలలు కన్నా వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారని ఆయన నేతృత్వంలో తెరాస అధికారంలోకి రావటం.. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్ణయాత్మక సూచనలు, సలహాలు ఇచ్చి అభివృద్ధి పనుల కోసం సహకరించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డుపై పటాన్చెరు ఎగ్జిట్ సమీపంలో ఆగి ఉన్న లారీని... -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు