logo

‘అగ్నిపథ్‌’ రద్దుకు పోరు బాట

అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మెదక్‌ పట్టణ స్థానిక ప్రధాన తపాలా

Published : 28 Jun 2022 01:11 IST

డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

సత్యాగ్రహ దీక్షలో తిరుపతిరెడ్డి, పద్మారావు, బాలకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి తదితరులు

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మెదక్‌ పట్టణ స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పేరుతో సైన్యాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు యువకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. అప్పటివరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పద్మారావు, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు మ్యాడం బాలకృష్ణ, సుప్రభాతరావు, కొండన్‌ సురేందర్‌గౌడ్‌, శ్రీకాంతప్ప, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు హఫీజొద్దీన్‌, రమేష్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని