మంజీరాలోకి మురుగు
మంజీర.. జిల్లాకు వరప్రదాయని. మెదక్, హవేలి ఘనపూర్, కౌడిపల్లి, చిలప్చెడ్, కొల్చారం తదితర మండలాలకు ఈ నదితోనే తాగు, సాగునీరు అందుతోంది. దీని ఆధారంగానే పంటలు పండిస్తున్నారు
న్యూస్టుడే, మెదక్ టౌన్
మహబూబ్ నహర్ కాలువలో కలుస్తున్న వ్యర్థాలు
మంజీర.. జిల్లాకు వరప్రదాయని. మెదక్, హవేలి ఘనపూర్, కౌడిపల్లి, చిలప్చెడ్, కొల్చారం తదితర మండలాలకు ఈ నదితోనే తాగు, సాగునీరు అందుతోంది. దీని ఆధారంగానే పంటలు పండిస్తున్నారు. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోనూ ఈ నది ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే వరకు మంజీర నది స్వచ్ఛంగానే ఉంటోంది. ఇక మెదక్లో అడుగుపెట్టడంతోనే మురుగు చేరి కలుషితమవుతుండటం గమనార్హం.
మెదక్ పట్టణంలోకి మహబూబ్ నహర్ కాలువ ద్వారా మంజీర అడుగుపెడుతుంది. 9, 10, 27 వార్డులతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి వెలువడే వ్యర్థాలన్నీ కాలువలోకి చేరుతోంది. ఈ కలుషిత నీరే సాగుకు ఉపయోగిస్తున్నారు. ఇక తాగేందుకు ఎంతమాత్రం వినియోగించలేని పరిస్థితి నెలకొంది. పట్టణంలోని వార్డులు పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేసిన విషయం విదితమే. ఆయా కాలనీల నుంచి మురుగు పారే కాలువలన్నీ మహబూబ్ నహర్ కాలువలోకి వెళ్తుండటంతో వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధానికి మారుపేరుగా మారింది.
నిర్లక్ష్యంతో..
సదరు కాలువ అధ్వానంగా మారినా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందులో వ్యర్థాలను సైతం తొలగించడం లేదు. తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 11వ వార్డు పరిధిలో ఉన్న మహబుబ్ నహర్ కాలువకు ఇరువైపులా స్థానిక కౌన్సిలర్ చొరవతో పలు రకాల మొక్కలను నాటారు. వర్షాకాలం సమీపించడంతో ఆ మొక్కల చుట్టూ చెత్తాచెదారాన్ని తొలగించిన పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలన్నీ ఆ నీటిలోనే వేయడం గమనార్హం.
కాలువల నిర్మాణానికి..
- శ్రీహరి, పురపాలిక కమిషనర్
అన్ని వార్డుల్లో భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి గతేడాది రూ.100 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. ప్రస్తుతం మహబూబ్నహర్ కాలువలో మురుగు నీరు కలవకుండా ప్రస్తుతం ఉన్న కాలువకు పైపులను అనుసంధానం చేసి 11వ వార్డులో ఉన్న మురుగు కాలువలోకి మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇటీవల పుర ఛైర్మన్ చంద్రపాల్తో కలిసి స్థలాన్ని సైతం పరిశీలించాం. త్వరలో పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం.
మరొకటి అందుబాటులోకి వస్తే..
ఆయా వార్డుల నుంచి వచ్చే మురుగునీరు మహబూబ్ నహర్ కాలువలో కలువకుండా ఉండేందుకు ఓ కాలువను నిర్మించారు. అయితే దాని నిర్వహణ లోపించడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అదంతా అధ్వానంగా మారింది. మట్టి పేరుకుపోవడంతో పాటు మొక్కలతో నిండిపోయింది. దీనికితోడు అక్కడక్కడ కూడా కూలిపోయింది. దీంతో మురుగంతా పక్కనే ఉన్న మహబూబ్నహర్ కాలువలోకి చేరుతోంది. ఇక ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు, పై నుంచి నీటిని వదిలిన సమయంలో అందులోకి మురుగు చేరుతోంది. ప్రస్తుతం ఉన్న మరో కాలువను బాగుచేయించి మట్టిని తొలగిస్తే మురుగు ముందుకు సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. ఇకనైనా ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలని పట్టణ వాసులు విన్నవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్