చెరువులకు హద్దు... దాటి రావొద్దు
చెరువుల కబ్జా ఇక అంత సులువు కాదు. ఒకవేళ ఆక్రమించి ప్లాట్లు వేసినా.. ఇళ్లు కట్టినా.. ఎప్పుడు కూల్చివేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. చెరువులను భావి తరాలకు భద్రంగా అందించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చేపడుతున్న చర్యలు తుది దశకు చేరుకుంటున్నాయి.
7 జిల్లాల్లో 3,114 తటాకాలకు ఎఫ్టీఎల్ గుర్తిస్తూ నోటిఫికేషన్
ఈనాడు, హైదరాబాద్
చెరువుల కబ్జా ఇక అంత సులువు కాదు. ఒకవేళ ఆక్రమించి ప్లాట్లు వేసినా.. ఇళ్లు కట్టినా.. ఎప్పుడు కూల్చివేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. చెరువులను భావి తరాలకు భద్రంగా అందించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చేపడుతున్న చర్యలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఏడు జిల్లాల పరిధిలో మొత్తం 3,532 చెరువులను ఇప్పటికే గుర్తించారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి.. పూర్తి నిల్వ సామర్థ్యం(ఎఫ్టీఎల్)ను అంక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పక్కాగా హద్దులు గీస్తున్నారు. 3,114 చెరువులకు ఇప్పటికే ఎఫ్టీఎల్ హద్దులు పూర్తి చేశారు. భవిష్యత్తులో మార్చేందుకు అవకాశం లేకుండా పక్కాగా చేపడుతున్నారు. ఇందులో 2,436 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. 230 చెరువులకు తుది నోటిఫికేషన్ వెలువరించారు. తుది నోటిఫికేషన్ ఇచ్చిన వాటి విషయంలో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు. వచ్చే ఆరు నెలల్లో తుది నోటిఫికేషన్ తతంగం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు.
రక్షణ ఇలా
*చాలా చెరువులు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) 1992, 2002, 2012 మ్యాపులను పరిగణలోకి తీసుకొని ఎఫ్టీఎల్ను గుర్తించారు. సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్లు, రెవెన్యూ మ్యాపులను ఆధారం చేసుకున్నారు.
* పకడ్బందీగా చేయడం వల్ల ఎఫ్టీఎల్ పక్కాగా నిర్ధారణ అయింది. నగరంలోని బతుకమ్మకుంట చుట్టూ భారీ ఆక్రమణలున్నట్లు సర్వేలో తేలింది. బండరావిర్యాల చెరువు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖుల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల గుర్తింపునకు, చర్యలకు మ్యాపులు కీలకం కానున్నాయి. లేఅవుట్లు, కట్టడాలకు అనుమతులు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడనున్నాయి. హెచ్ఎండీఏ వెబ్సైట్లో 2,408 చెరువుల ఎఫ్టీఎల్ వివరాలు పొందుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM