ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి
దేశంలోనే ఆర్డీవో నుంచి అటెండర్ వరకున్న ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు హక్కు కల్పించిన రాష్ట్రం మనదేనని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్లోని
ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్
మెదక్లో శిక్షణార్థులకు పుస్తకాలు అందిస్తున్న దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పద్మ తదితరులు
మెదక్ టౌన్, రామాయంపేట, న్యూస్టుడే: దేశంలోనే ఆర్డీవో నుంచి అటెండర్ వరకున్న ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు హక్కు కల్పించిన రాష్ట్రం మనదేనని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్లోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన ఉచిత ఉద్యోగ శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందని గుర్తుచేశారు. జిల్లాలోని కొల్చారానికి చెందిన మల్లినాథ సూరి దేశంలోని గొప్ప కవుల్లో ఒకరని, ఆయన వల్లే కాళిదాసుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమించాలన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. రానున్న 60 రోజులు కష్టపడి చదివితే మిగతా 60 ఏళ్లు సంతోషంగా ఉంటామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నియోజకవర్గానికి చెందిన వారికి ఉద్యోగాలు వస్తేనే నాకు సంతృప్తి ఉంటుందన్నారు. పోలీసు ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఎస్పీ సహకారంతో దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్కు సైతం ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రైవేట్ శిక్షణ కేంద్రాలకు దీటుగా తర్ఫీదు ఇచ్చామన్నారు. అనంతరం శిక్షణార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేశారు. జడ్పీ అధ్యక్షురాలు హేమలత, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మెదక్ డీఎస్పీ సైదులు, పీజేఆర్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ జగదీశ్వర్ తదితరులున్నారు. రామాయంపేటలోనూ దేశపతి, పద్మాదేవేందర్రెడ్డిలు పోలీసు శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు పుస్తకాలు అందజేశారు. అదనపు ఎస్పీ బాలస్వామి నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐ రాజేష్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్