దివ్యాంగుల మార్గదర్శి!
దివ్యాంగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వినియోగంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ తదితర వివరాలు సులభంగా తెలుసుకునేలా కేంద్ర ప్రభుత్వం
అందుబాటులోకి ప్రత్యేక యాప్
విద్య, ఉద్యోగ, ఉపాధి సమాచారం ఒకే చోట
న్యూస్టుడే, పెద్దశంకరంపేట
దివ్యాంగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వినియోగంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ తదితర వివరాలు సులభంగా తెలుసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘దివ్యాంగ సారథి’ పేరిట యాప్ను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్ సాయంతో తెలుసుకునే వెసులుబాటు కల్పించడం విశేషం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి తెలియక ఎంతో మంది అవకాశాలను వినియోగించుకోలేక వెనుకంజ వేస్తున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సదరు యాప్ను రూపొందించారు. ఇందులో వారికి సంబంధించిన అన్ని అంశాలనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. యాసిడ్ దాడి బాధితులు, పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికీ ఉపయోగపడే పథకాల గురించి తెలుసుకోవచ్చు.
డౌన్లోడ్ ఇలా..
యాప్ని స్మార్ట్ చరవాణిలో డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని తెలుసుకుని లబ్ధి పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దివ్యాంగ సారథి అని టైప్ చేస్తే సదరు యాప్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎంచక్కా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో సమాచారం లభిస్తుంది. అంతేకాకుండా ఎవరిని ఎలా సంప్రదించాలో తెలిపే ఫోన్ నెంబర్లు సైతం పొందుపర్చారు.
ఉద్యోగావకాశాలు..
దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పథకాల వివరాలనూ తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్ ఎంతో దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంధత్వం, వినికిడి, మూగ లక్షణాలు ఉన్నవారు, నడవ లేని వారు, మరుగుజ్జులు, మానసిక దివ్యాంగులు, మస్తిక్క పక్షవాతం, ఆమ్ల దాడి బాధితులు, తీవ్ర నాడి సంబంధ సమస్యలు కలిగిన వారికి ఉపయోగడపడుతుంది.
* భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైన అవయవాలు కావాలంటే ఏం చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకుని పొందాలి అనే వివరాలు ఉండటంతో పాటు ఆయా ప్రాంతాల వారీగా సమాచారం ఉంటుంది.
వీటి గురించి సైతం..
రవాణా, ఇతరత్రా వాటిల్లో రాయితీలు, దీన్దయాళ్ దివ్యాంగుల పునరావాస పథకం, ఉన్నత చదువులు, ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు, జాతీయ ఉపకార వేతనాలు, ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, విదేశాల్లో చదువు తదితర అంశాలు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి సదరు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికితోడు ఎవరెవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలూ ఉంటాయి. వీటి ఆధారంగా ఆసక్తి ఉండి, అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రత్యేక సంస్థల వివరాలు..
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న సంస్థల గురించి ఇందులో ఉంచారు. జాతీయ దివ్యాంగ ఆర్థిక అభివృద్ధి సంస్థ, అలీయావర్ జంగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ద హియరింగ్ హ్యాండీకాప్డ్, స్వామి వివేకానంద జాతీయ పునరావాస శిక్షణ కేంద్రం, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వికలాంగ జాతీయ సంస్థ, భారతీయ సంజ్ఞ భాషల పరిశోధనా కేంద్రం, తదితర సంస్థల వివరాలు, వాటిలో చేరడం ఎలా, కలిగే ప్రయోజనాలు, అవకాశాలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాకుండా ఆయా సంస్థలకు చెందిన ప్రాంతీయ కేంద్రాల వివరాలు, దివ్యాంగుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల వివరాలను సైతం పొందుపర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!