కలుషితాహారం తిని 128 మంది విద్యార్థినుల అస్వస్థత
కలుషితాహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోంచేసి పడుకున్న బాలికలు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అవస్థలు పడ్డారు
మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన
బాలికలకు గురుకులంలోనే చికిత్స
సిద్దిపేట, సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: కలుషితాహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోంచేసి పడుకున్న బాలికలు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అవస్థలు పడ్డారు. గురుకులంలో ఐదు నుంచి ఇంటర్ వరకు 485 మంది చదువుతున్నారు. ఆదివారం 323 మంది విద్యార్థినులు ఉన్నారు. గురుకులంలో మధ్యాహ్నం చికెన్ కూర, బగారా వండారు. రాత్రి వంకాయ కూర, సాంబారు, సాధారణ అన్నం చేశారు. రాత్రిపూట వంకాయ కూరలో మధ్యాహ్నం మిగిలిన చికెన్ను కొందరు కలిపి తిన్నారు. అర్ధరాత్రి నుంచి 128 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లు తిరగడం, ఇతరత్రా లక్షణాలతో అవస్థపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ వైద్యుడు, సిబ్బందిని నిర్వాహకులు రప్పించి చికిత్సలు ప్రారంభించారు. కొందరికి అక్కడే సెలైన్లు ఎక్కించారు. ద్రావణాలు అందించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర మైనార్టీ గురుకులాల విద్యా సంస్థ అసిస్టెంట్ కార్యదర్శి ఎండీ యూసుఫ్ ఆలీ, విజిలెన్స్ అధికారి గౌస్పాష, జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్ఛార్జి అధికారి గోపాల్రావు, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ చేరుకొని పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులను పరామర్శించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వివరించారు. ప్రిన్సిపల్ శ్రీలత, వార్డెన్ రజియాసుల్తానాను విచారించారు. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో ప్రిన్సిపల్ లేరు. వార్డెన్ సాయంత్రం 7 గంటల అనంతరం అత్యవసర సొంత పని నిమిత్తం బయటకు వెళ్లారు. భోజనాల సమయంలో ఒక ఉపాధ్యాయురాలు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని విద్యార్థులు వివరించారు.
జిల్లా ఆసుపత్రికి 19 మంది తరలింపు..
ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలకు ఏమైందంటూ పలువురు పాఠశాలకు చేరుకున్నారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని యూసుఫ్ ఆలీ చెప్పారు. జిల్లా వైద్యాధికారిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా.. విద్యార్థినులు క్షేమంగా ఉన్నారని, ఒకరోజు పరిశీలన కొనసాగుతుందన్నారు. సోమవారం రాత్రి 19 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఘటనపై స్పందిస్తూ.. మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాలికలు కోలుకునేంత వరకు పర్యవేక్షించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు