సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం: పాలనాధికారి
‘ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం కావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. ప్రతి సోమవారం విధిగా అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరవ్వాలి’ అంటూ జిల్లా పాలనాధికారి డాక్టర్ ఎ.శరత్ స్పష్టం చేశారు.
గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ను సన్మానిస్తున్న జిల్లా అధికారులు, చిత్రంలో పాలనాధికారి శరత్..
ఈనాడు, సంగారెడ్డి: ‘ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం కావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. ప్రతి సోమవారం విధిగా అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరవ్వాలి’ అంటూ జిల్లా పాలనాధికారి డాక్టర్ ఎ.శరత్ స్పష్టం చేశారు. ఈనెల 27న నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలేంటనే విషయాన్ని తెలుసుకున్నారు. వాస్తవానికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజావాణికి రావాలి. గత కొన్నేళ్లుగా ఎవరూ దీనిని పాటించడం లేదు. తమ కిందస్థాయి ఉద్యోగులను పంపుతూ మమ అనిపిస్తున్నారు. కనీసం తమ విభాగానికి సంబంధించి ప్రజావాణిలో ఎన్ని వినతులు వచ్చాయనే విషయాన్నీ వారు తెలుసుకోవడం లేదు. ఈ విషయాలన్నీ జిల్లా పాలనాధికారి డాక్టర్ ఎ.శరత్ దృష్టికి రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణికి హాజరుకాని జిల్లాస్థాయి అధికారులకు మోమోలు జారీ చేయాలని డీఆర్వో రాధికా రమణిని ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో ప్రజలను పదే పదే తిప్పించుకోవద్దని చెప్పారు. సమస్య ఏంటనే విషయాన్ని సావధానంగా విని పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జాప్యం చేయకుండా ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చాలన్నారు. ఎన్నిరోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్నీ అర్జీదారులకు స్పష్టంగా చెప్పాలన్నారు. ఒకవేళ వారి స్థాయిలో సమస్య తీర్చలేరని భావిస్తే.. ఎందుకు జిల్లాస్థాయిలో ఈ సమస్యను పరిష్కరించలేరనే సంగతివారికి చెప్పి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా చూడాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు ఇకపై ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి... ఆ వివరాలనూ నమోదు చేయాలన్నారు. అర్జీ తీసుకున్న తర్వాత కచ్చితంగా వారికి రసీదు ఇవ్వాలని ఆదేశించారు.
హనుమంతరావు సౌమ్యుడు..
సంగారెడ్డి టౌన్: జిల్లా పాలనాధికారిగా పనిచేసి గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా బదిలీపై వెళ్లిన హనుమంతరావు సౌమ్యుడని పాలనాధికారి శరత్ పేర్కొన్నారు. సోమవారం రెవెన్యూ ఉద్యోగుల సంఘం, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన హనుమంతరావు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలనాధికారి శరత్లకు ఆత్మీయ అభినందన, సన్మాన కార్యక్రమాలను కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలనాధికారి శరత్ మాట్లాడుతూ హనుమంతరావు జిల్లాను అగ్రగామిలో నిలిపి, తనదైన ముద్ర వేశారని కొనియాడారు. హనుమంతరావు మాట్లాడుతూ కలెక్టర్ శరత్ అన్ని విషయాల్లో ప్రణాళికతో ముందుకుసాగుతారని, జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు రాములు, కార్యదర్శి మహిపాల్రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!