మద్యం మత్తులో మహిళ దారుణహత్య
మద్యం మత్తులో మతిస్థిమితం లేని మహిళను అత్యాచారం చేసి హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుండగులైన ఇద్దరు బిహార్ వలస కూలీలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. సోమవారం సాయంత్రం పెద్దశంకరంపేట ఠాణాలో
శివాయపల్లి కేసును ఛేదించిన పోలీసులు
ఇద్దరు బిహార్ వలస కూలీల రిమాండ్
పెద్దశంకరంపేటలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డీఎస్పీ సైదులు, సీఐ జార్జ్, తదితరులు
పెద్దశంకరంపేట, న్యూస్టుడే: మద్యం మత్తులో మతిస్థిమితం లేని మహిళను అత్యాచారం చేసి హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుండగులైన ఇద్దరు బిహార్ వలస కూలీలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. సోమవారం సాయంత్రం పెద్దశంకరంపేట ఠాణాలో జరిగిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మండలంలోని శివాయపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ (39) మూడేళ్ల క్రితం భర్తను వదిలేసింది. ఈ క్రమంలో గ్రామాల్లో తిరుగుతూ ఉండేది. ఈ నెల 16న రాత్రి 8 గంటల సమయంలో గ్రామ సమీపంలో ఉన్న మిల్లులో బిహార్ నుంచి మూడు నెలల క్రితం వచ్చిన వలస కూలీలు చెడిముఖియా, సజిత్రిషిదేవ్లు కల్లు తాగి రోడ్డు వెంట తిరుగుతున్నారు. మల్లికార్జున మిల్లు చౌరస్తాలోని గుడిసెలో ఉన్న సదరు మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించి శివాయపల్లి గ్రామం వైపు వెళ్లగా.. నిందితులు బలవంతంగా పక్కనున్న చేనులోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. విషయం బయట పడితే తాము దొరికిపోతామేమోనని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని ఓ గొయ్యి తవ్వి పాతిపెట్టారు. తిరిగి నిందితులు మిల్లులో రూముకు వచ్చి మరునాడు మహారాష్ట్రకు పారిపోయారు. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయని భావించి మళ్లీ అదే మిల్లులో పనిలో చేరారు. 21న మహిళ మృతదేహం వెలుగు చూడగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారం జరిగిందని గుర్తించారు. ఈ క్రమంలో చెడిముఖియా, సజిత్రిషిదేవ్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారిని రిమాండ్కు తరలించారు. కేసును వారంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్, మెదక్ రూరల్ సీఐ విజయ్కుమార్, ఎస్ఐలు బాలరాజు, సత్యనారాయణ, లింగం తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ