నాసి విత్తనాలపై.. నిఘా!
ఖరీఫ్ వచ్చిందంటే చాలు నాసి విత్తనాలు విక్రయించే వారి బెడద ఎదురవుతోంది. నాసి విత్తనాలు, నిషేధిత రసాయనాలు రైతులకు అంటగడుతూ అక్రమార్కులు మోసాలకు పాల్పడుతుంటారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని
దుకాణాల్లో ముమ్మరంగా సోదాలు
దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు
న్యూస్టుడే, పెద్దశంకరంపేట: ఖరీఫ్ వచ్చిందంటే చాలు నాసి విత్తనాలు విక్రయించే వారి బెడద ఎదురవుతోంది. నాసి విత్తనాలు, నిషేధిత రసాయనాలు రైతులకు అంటగడుతూ అక్రమార్కులు మోసాలకు పాల్పడుతుంటారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో నాసి విత్తనాలతో అన్నదాతలు బేజారవుతున్నారు. ఈ క్రమంలో నాసి బెడదను అరికట్టేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. అన్ని మండలాల్లో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అక్రమార్కులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
పకడ్బందీగా తనిఖీలు..
వానాకాలంలో జిల్లాలో 3,31,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా వరి, రెండో పంటగా పత్తి సాగు చేస్తారని ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు కంది, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకు 45 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇదే అదునుగా..
జిల్లాలో మొత్తం 230 వరకు ఎరువులు, విత్తనాల దుకాణాలు ఉన్నాయి. సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో కొంత మంది ప్రైవేటు వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరిట మార్కెట్లో విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటిలో నుంచి నాసి రకాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఏటా ఏదో చోట దుకాణాల నిర్వాహకులు నాసి విత్తనాలను అంటగడుతున్నారు.
ఆన్లైన్లో వివరాలు..
విత్తనాలు కొనుగోలు సమయంలో రసీదులు తీసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నష్టం వాటిల్లినప్పుడు వాటి ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ ఫిర్యాదులు అందుతున్నా రసీదులు లేకపోవడంతో అవన్నీ నీరుగారుతున్నాయి. విత్తనాల సంచులపై ఎక్కడ తయారు చేశారు, మొలకశాతం, స్వచ్ఛత తదితర వివరాలు ముద్రించి ఉండాలి. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువుల స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. ఆయా వివరాల ఆధారంగా లెక్కల్లో తేడా వస్తే లైసెన్స్లు రద్దు చేసే అవకాశం లేకపోలేదు.
టాస్క్ఫోర్స్ బృందాలు..
ఐదేళ్లుగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న టాస్క్ఫోర్స్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఈ బెడద కాస్త తగ్గింది. జిల్లాలో మెదక్, కౌడిపల్లి, నర్సాపూర్, రామాయంపేట, పెద్దశంకరంపేట సబ్డివిజన్లు ఉన్నాయి. జిల్లాకు రాష్ట్ర బృందం, జిల్లా బృందం, మండలానికి ఒక బృందం చొప్పున మూడు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర బృందంలో వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులు, జిల్లా బృందంలో పాలనాధికారి, అధికారులు, మండల బృందంలో ఏవో, పోలీసు సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. నాసి విత్తనాలు, నిషేధిత గ్లైకోసెట్ కలుపు మందులపై దృష్టిసారించారు.
నిబంధనలు పాటించాలి
- పరశురాంనాయక్, డీఏవో
నాసి విత్తనాలు, నిషేధిత రసాయనాల వంటివి విక్రయించకుండా ఉండటానికి పకడ్బందీగా ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాం. టాస్క్ఫోర్స్ బృందాల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం