కలుషితాహారం ఘటనలో నలుగురిపై వేటు
మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై సిద్దిపేట సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది విద్యార్థినులను వైద్యులు డిశ్ఛార్జి చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.
ప్రిన్సిపల్ సస్పెన్షన్..
విధుల నుంచి డిప్యూటీ వార్డెన్, ఇద్దరు వంట సిబ్బంది తొలగింపు
సిద్దిపేట, న్యూస్టుడే: కలుషితాహారం తిని 128 మంది బాలికలు అనార్యోగానికి గురైన ఘటనలో బాధ్యులైన నలుగురిపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు మైనార్టీ గురుకులాల విద్యా సంస్థ రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనంలో వంకాయ కూరతో మధ్యాహ్నం మిగిలిన చికెన్ కూర కలుపుకొని తిన్న పలువురు విద్యార్థినులు ఆ రోజు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లు తిరగటం, ఇతర లక్షణాలతో బాధపడిన విషయం తెలిసిందే. 22 మంది స్థానిక సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందారు. చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం, భోజన నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలతను సస్పెండ్ చేయగా, డిప్యూటీ వార్డెన్ రజియా సుల్తానా, వంట సిబ్బంది (హెడ్ కుక్లు) దుర్దన, నాగరాణిలను విధుల నుంచి తొలగించారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు (పీజీటీ) సుప్రియకు, ఇన్ఛార్జి డిప్యూటీ వార్డెన్గా గణిత ఉపాధ్యాయురాలు (టీజీటీ) మమతకు బాధ్యతలు అప్పగించారు. కొత్త వంట మనుషులను నియమించిన తరువాత ఆ ఇద్దరు వంట సిబ్బందిని తొలగించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోలుకున్న విద్యార్థినులు
బాలికలను అంబులెన్సులో పంపిస్తున్న ఆస్పత్రి సిబ్బంది
సిద్దిపేట టౌన్: మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై సిద్దిపేట సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది విద్యార్థినులను వైద్యులు డిశ్ఛార్జి చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఉదయం అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ వారిని పరామర్శించారు. విద్యార్థినులను జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, సూపరింటెండెంట్ కిశోర్కుమార్, రాష్ట క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ఆర్ఎంఓ చంద్రశేఖర్ దగ్గరుండి పాఠశాలకు పంపించారు. అక్కడినుంచి కొందరిని వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!