శిక్షణ.. ఉత్పత్తి కేంద్రంగా సెట్విన్
సెట్విన్.. ఉత్పత్తి కేంద్రంగా ఎదగనుంది. ఒకప్పుడు శిక్షణలకే పరిమితమైన ఈ సంస్థ.. క్రమంగా ఉత్పత్తుల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. పర్యావరణ హితం, మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేట
సిద్దిపేటలో వస్త్ర న్యాప్కిన్ల తయారీ షురూ
స్వయం ఉపాధికి బాటలు
న్యాప్కిన్ల తయారీలో మహిళలు
న్యూస్టుడే, సిద్దిపేట: సెట్విన్.. ఉత్పత్తి కేంద్రంగా ఎదగనుంది. ఒకప్పుడు శిక్షణలకే పరిమితమైన ఈ సంస్థ.. క్రమంగా ఉత్పత్తుల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. పర్యావరణ హితం, మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేట సహా వివిధ ప్రాంతాల్లో ‘రుతుప్రేమ’ కార్యక్రమం అమలవుతోంది. అందులో భాగంగా పర్యావరణ హితమైన వస్త్రంతో తయారీ చేసిన న్యాప్కిన్లు (శానిటరీ), మెడికల్ గ్రేడ్ సిలికాన్ కప్లు పంపిణీ చేస్తున్నారు. వస్త్రంతో తయారీ చేసిన న్యాప్కిన్లను ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ తరుణంలో సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలోనే తయారీ చేసి మార్కెటింగ్ చేయాలనే యోచన నిర్వాహకులకు తట్టింది. ఇది ఇటీవల కార్యరూపం దాల్చింది. నెల రోజులుగా ముడి సరకును తెప్పిస్తూ.. తయారీ చేస్తున్నారు. సెట్విన్ ద్వారా ఏటా 10 కోర్సుల్లో దాదాపు 1000 మంది యువతీ యువకులకు తర్ఫీదు అందిస్తున్నారు. ఇన్నాళ్లు శిక్షణ ఇవ్వగా.. ప్రస్తుతం ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఫలితంగా కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పలువురికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది.
బెంగళూరు నుంచి ముడిసరకు..
నాణ్యత కలిగిన వస్త్ర న్యాప్కిన్లు కుట్టడంపై గత నెల బెంగళూరుకు చెందిన ప్రతినిధుల బృందం తొలుత 15 మందికి శిక్షణ అందించింది. ఇవి కుట్టాలంటే ప్రత్యేక యంత్రాలు (ఇండస్ట్రియల్ మిషన్లు) తప్పనిసరి. అప్పటికే కొంత అవగాహన ఉన్న వారు తర్ఫీదు పొందడం ద్వారా సెట్విన్లో సునాయాసంగా తయారీ చేస్తున్నారు. ఒప్పందం మేర ప్రభుత్వానికి లేదా ప్రైవేటుగా విక్రయాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో క్లాత్ ప్యాడ్ బహిరంగ విపణిలో ధర రూ.700 పలుకుతోంది. స్థానికంగా రూ.150 నుంచి 250 వరకు విక్రయించాలని నిర్ణయించారు. పునర్వినియోగమైన ఈ ఉత్పత్తిని దాదాపు రెండేళ్ల పాటు వినియోగించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ముడి సరకును బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఆర్డర్ తీసుకొని డిమాండ్ మేర సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తొలిగా 2100 సరఫరా..
మూడు నెలల కిందట సిద్దిపేటలోని ఐదో వార్డును బల్దియా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ‘రుతుప్రేమ’కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ వార్డులో విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో జిల్లాలో శాఖల వారీగా ఉద్యోగినులకు అవగాహన కల్పిస్తూ పంపిణీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతున్నారు. క్రమంగా జిల్లాలో కార్యక్రమం విస్తరిస్తున్న తరుణంలో స్థానికంగా నాణ్యతతో తయారీ చేసి విక్రయించడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది. ఈ విషయమై సెట్విన్ జిల్లా సమన్వయకర్త అమీనాభాను ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన స్టోన్సూప్ సంస్థ సహకారంతో క్లాత్ప్యాడ్ల తయారీ మొదలెట్టాం. ఇటీవల ఉత్పత్తి నాణ్యతను పరిశీలించిన ఆ సంస్థ ఆమోదం తెలిపింది. తొలి ఆర్డర్గా సెట్విన్ ద్వారా 2100 క్లాత్ ప్యాడ్లు తయారీ చేసి ‘రుతుప్రేమ’ కార్యక్రమానికి అందించాం. ప్రైవేటుగాను పలువురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!