అవగాహన కలిగేలా.. ఆకట్టుకునేలా..!
ప్రకృతి సమాచారం.. రమణీయ దృశ్యాలు.. దేశంలో విస్తరించి ఉన్న అటవీ, వ్యవసాయ భూములు.. వివిధ జంతువులు.. నేలల రకాలు.. సాగు చేసే పంటల వివరాలు.. ఇలా అన్ని విషయాలు తెలుసుకునేందుకు ములుగు అటవీ కళాశాల పరిశోధనా
అటవీ కళాశాల పరిశోధనా కేంద్రంలో కొలువుదీరిన మ్యూజియం
నేల రకాలను తెలిపే చిత్రమాలిక
ప్రకృతి సమాచారం.. రమణీయ దృశ్యాలు.. దేశంలో విస్తరించి ఉన్న అటవీ, వ్యవసాయ భూములు.. వివిధ జంతువులు.. నేలల రకాలు.. సాగు చేసే పంటల వివరాలు.. ఇలా అన్ని విషయాలు తెలుసుకునేందుకు ములుగు అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం వేదికగా మారింది. రాష్ట్రం నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులను అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ములుగులో సదరు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పిన విషయం విదితమే. తాజాగా ఈ కళాశాలను ప్రభుత్వం అటవీ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు మంత్రివర్గ సమావేశం నిర్ణయించగా.. ఆ మేరకు ఉత్తర్వులూ జారీ అయ్యాయి. ఇక పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయంగా అవతరిస్తే దేశంలోనే మొదటిదిగా ప్రాచుర్యం పొందడం ఖాయం. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి కళాశాలలో ప్రత్యేకంగా ఓ మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
కలపతో తయారు చేసిన వస్తువులు
భూములు.. అడవులు..
మ్యూజియంలో ఎన్నో అంశాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రపంచంలో మృత్తికల రకాలు తెలిసేలా చిత్రాలు కొలువుదీరాయి. ఏ దేశంలో ఎలాంటి భూములు, ఏ పంటలు పండుతాయి, నేలల రకాలను తెలిపేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అడవుల రకాలను తెలిసేలా చిత్రాలు ఉంచారు. ఇందులో ఉష్ణమండల తడి ఆకురాల్చు, ఉష్ణమండల పొడి ఆకురాల్చు, ్జ్జ్జమర అడవులు, పొడి సతత హరితారణ్యాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని తెలిపే అంశాలు లిఖించారు. అవన్నీ తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో సారాంశాన్ని పొందుపర్చారు.
వివిధ ఆకృతులు..
మ్యూజియంంలో ఏర్పాటు చేసిన ఏనుగు, జింకలు, కోతులు, కొంగలు, పులుల ప్రతిమలు చూడగానే ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. పలు రకాల కలపతో ఏర్పాటు చేసిన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణీయమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో అడవుల్లోని వృక్షాల విత్తనాలు సేకరించి ప్రదర్శనగా ఉంచారు. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పువ్వు తంగెడు చెట్టు, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాటి చిత్రాల వద్ద ఏర్పాటు చేశారు. మ్యూజియంలో గాలిలో ఎగిరే సీతాకొక చిలుక రకాలు, గాలిలో ఎగిరే జీవులను సేకరించి చూసే అవకాశం కల్పించారు.
భవిష్యత్తులో మరిన్ని..: ప్రియాంక నర్గీస్, కళాశాల డీన్
మ్యూజియం ద్వారా ప్రతి అంశం అందరికీ తెలియాలన్నదే మా లక్ష్యం. ఇప్పటికే అడవులు, జంతువులు, భూముల రకాలను తెలిపే అంశాలెన్నో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాం.
- న్యూస్టుడే, ములుగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.