వార్డుల్లో సమస్యలు పట్టవా..?
వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్ పురపాలిక సర్వసభ్య సమావేశం ఛైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. 24వ వార్డు కౌన్సిలర్ మేఘమాల మాట్లాడుతూ..
పురపాలిక సమావేశంలో అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
అధ్యక్షుడు చంద్రపాల్తో మాట్లాడుతున్న కౌన్సిలర్ సమియోద్దీన్
మెదక్ టౌన్, న్యూస్టుడే : వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్ పురపాలిక సర్వసభ్య సమావేశం ఛైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. 24వ వార్డు కౌన్సిలర్ మేఘమాల మాట్లాడుతూ.... తన వార్డు పరిధిలో మిషన్ భగీరథ పనుల కారణంగా రోడ్డు ధ్వంసమైందని, రాకపోకలు సాగించాలంటే అవస్థలు తప్పడం లేదన్నారు. పర్యవేక్షణ కొరవడటంతో విలువైన తాగునీరు వృథాగా పోతుందని, మరికొన్ని ప్రాంతాల్లో నీరు సక్రమంగా రావడమే లేదన్నారు. ఆమెకు మద్దతుగా ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ...పెద్దబజార్, నవాబుపేట తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గత మూడు నెలల నుంచి మిషన్ భగీరథ సమస్యలపై సమావేశంలో చర్చించి.. ప్రతిసారీ రికార్డుల్లో రాసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని డీఈఈ మహేశ్ను నిలదీశారు. ప్రస్తుతం జలవనరులు ఉన్పప్పటికీ ప్రజలకు సరిపడా నీరు అందించలేక పోవడంతో చెడ్డపేరు తీసుకువస్తున్నారని అధ్యక్షుడు చంద్రపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17వ వార్డు కౌన్సిలర్ రాజలింగం స్పందిస్తూ మిషన్ భగీరథ పనుల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మరమ్మతులకు రూ.10 లక్షలు కేటాయించామని డీఈఈ సమాధానం ఇవ్వగా.. 32 వార్డుల్లో మరమ్మతులు చేసేందుకు సరిపోతాయా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామగ్రిని అందించాలని 19వ వార్డు కౌన్సిలర్ జయరాజ్ సూచించడంతో.. విడుతల వారీగా పంపిణీ చేస్తామని చంద్రపాల్ తెలిపారు. సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆయా వార్డుల్లో తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
‘ఈనాడు’ కథనాలపై చర్చ..
జూన్ 28న (మంగళవారం) పట్టణంలోని 5 వార్డుల నుంచి వెలువడుతున్న మురుగు.. మంజీరాలో కలిసి కలుషితమవుతున్న తీరుపై ‘మంజీరాలోకి మురుగు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీన్ని 11వ వార్డు కౌన్సిలర్ సమియోద్దీన్ సభలో ప్రస్తావించారు. మహబూబ్నహర్ కాలువలో మురుగు కలవకుండా పెద్ద పైపులను అనుసంధానం చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
ః పట్టణంలో కుక్కల బెడదపై జూన్ 16న ‘వణికిస్తూ..కాటేస్తూ..’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం వచ్చింది. దీనిపై ఉపాధ్యక్షుడు మల్లికార్జున్గౌడ్ సభ దృష్టికి తెచ్చారు. పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి స్థలం సమస్య పరిష్కరించి పనులు చేపడుతామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం