బోధన ఉత్తమం.. ఫలితం శతశాతం
ఏక్ బార్, దోబార్, తీన్బార్, చార్బార్, పాంచ్బార్, చేబార్...ఇదేదో వేలం పాట అనుకుంటే పొరపాటు. పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో వరుసగా ఐదు, ఆరో సంవత్సరం శతశాతం ఉత్తీర్ణత సాధించి ఘనతను చాటుకోవడం విశేషం. ఉపాధ్యాయుల చక్కటి బోధన, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కింది. ఇలా వరుసగా వంద శాతం ఫలితాలు సాధించిన తీరుపై ప్రత్యేక కథనం.
ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలలు
న్యూస్టుడే, చేగుంట, పాపన్నపేట, టేక్మాల్
నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలలో..
ఏక్ బార్, దోబార్, తీన్బార్, చార్బార్, పాంచ్బార్, చేబార్...ఇదేదో వేలం పాట అనుకుంటే పొరపాటు. పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో వరుసగా ఐదు, ఆరో సంవత్సరం శతశాతం ఉత్తీర్ణత సాధించి ఘనతను చాటుకోవడం విశేషం. ఉపాధ్యాయుల చక్కటి బోధన, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కింది. ఇలా వరుసగా వంద శాతం ఫలితాలు సాధించిన తీరుపై ప్రత్యేక కథనం.
జిల్లాలో చేగుంట, పాపన్నపేట, టేక్మాల్లోని జడ్పీ ఉన్నత, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించడం విశేషం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో చక్కటి ఫలితాలు సాధించడానికి మార్గం సుగమమైంది.
ప్రత్యేక శ్రద్ధ చూపి..
కరోనా విజృంభణతో 2020 మార్చిలో పాఠశాలలు మూతపడిన విషయం విదితమే. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో గత విద్యాసంవత్సరం సెప్టెంబరులో ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. అంతకంటే ముందు ఆన్లైన్, దూరదర్శన్ ద్వారా పాఠాలు బోధించారు. ఇక ప్రత్యక్ష బోధన మొదలైనప్పటి నుంచి పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పిల్లల ఇళ్లకు వెళ్లి సందేహాలు తీర్చడం, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఫలితాల సాధనకు దోహదం చేశాయి. నిత్యం ప్రత్యేక తరగతులతో పాటు పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని చరవాణి ద్వారా పర్యవేక్షించారు. తరచూ వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడటం, వారికి సూచనలు చేస్తూ వచ్చారు. సమావేశాలు సైతం నిర్వహించి ఇళ్ల వద్ద చదివించేలా సూచించారు.
లక్ష్యాన్ని నిర్దేశించి..
పాపన్నపేట మండలం కొత్తపల్లి, గాంధారిపల్లి, పొడ్చన్పల్లి, కుర్తివాడ, నాగ్సాన్పల్లి, యూసూఫ్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరుసగా శతశాతం ఉత్తీర్ణత సాధిస్తూ మన్ననలు పొందుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇవే ఫలితాలతో దూసుకెళ్తున్నాయి. ఇక్కడి ఉపాధ్యాయులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నిత్యం ప్రత్యేక తరగతులు చేపట్టారు. రోజూ తెల్లవారుజామున లేపి చదివించేలా తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. తరచూ ఫోన్లు చేయడం, ఆకస్మికంగా ఇళ్లకు వెళ్లి తనిఖీ చేస్తూ విద్యార్థులు చదివేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. లక్ష్యనిర్దేశన చేసి ప్రోత్సహించారు.
* టేక్మాల్లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల సైతం ఐదేళ్లుగా శతశాతం ఫలితాలు సాధిస్తోంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు రాగానే నివృత్తి చేశారు. గత విద్యాసంవత్సరంలో వంద మంది వరకు ఉండగా.. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి పర్యవేక్షించారు.
ఆరు సార్లు..
కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
చేగుంట మండలం కరీంనగర్ జడ్పీ ఉన్నత పాఠశాల 2014-15 నుంచి 2021-22 వరకు వరుసగా (కరోనా సమయంలో రెండేళ్లు మినహా) ఆరు సార్లు శతశాతం ఫలితాలతో ముందంజలో నిలిచింది. ప్రధానోపాధ్యాయురాలు నీరజతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉండగా.. మొదటి నుంచి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పాఠశాల పచ్చదనానికి నిలయం. ప్రహరీ లేకపోయినా ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. రెండు సార్లు స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది. పది ఉత్తీర్ణతలోనూ ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచింది.
* చేగుంట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో వరుసగా ఐదేళ్ల నుంచి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ప్రిన్సిపల్ భూపాల్రెడ్డి పర్యవేక్షణలో ఉపాధ్యాయుల చక్కగా బోధన చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.