సర్వర్ సమస్యలిక దూరం!
అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. పారదర్శకతతో పాటు లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం కలిగేలా మార్పులు చేపడుతుండటం విశేషం. ఇందులో భాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయడానికి అవస
రేషన్ డీలర్లకు అందుబాటులోకి 4జీ పీఓఎస్ పరికరాలు
న్యూస్టుడే, పెద్దశంకరంపేట
కనుపాపలు వివరాలు తీసుకుంటున్న డీలర్
అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. పారదర్శకతతో పాటు లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం కలిగేలా మార్పులు చేపడుతుండటం విశేషం. ఇందులో భాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టింది. ఈ క్రమంలో 4జీ అనుసంధానమైన ఈ-పోస్ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల నుంచి వాటిని వినియోగించనున్నారు.
దుర్వినియోగం అరికట్టేలా.. : పౌరసరఫరాల శాఖలో ఈ-పోస్ విధానం పూర్తిగా అమలు జరుగుతూ దుర్వినియోగాన్ని అరికట్టింది. వేలిముద్ర సమస్యల పరిష్కారానికి ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంతర్జాల వినియోగం ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ వడివడిగా 5జీ వైపు అడుగులేస్తోంది. నిత్యావసర సరకుల పంపిణీకి రేషన్ దుకాణాల్లో మాత్రం ఇంకా 2జీ, 3 జీ ఆధారిత పరికరాలను వినియోగిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా సంకేతాల సమస్య లబ్ధిదారులను అవస్థలకు గురిచేస్తోంది. సమస్య పరిష్యారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆధునీకరణ ఈ-పోస్ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేషన్ డీలర్లకు ఇప్పటికే పంపిణీ చేశారు. ఈ నెల మొదటి రోజు నుంచి వినియోగంలోకి వచ్చాయి.
తప్పనున్న అవస్థలు : సర్వర్ సమస్యలతో 2జీ, 3జీ సిమ్లకు సంకేతాలు సక్రమంగా అందకపోవడంతో సరకుల పంపిణీలో జాప్యం ఏర్పడేది. తాజా పరికరాలతో సమస్య దూరం కానుందని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జియో కంపెనీకి చెందిన 4జీ నెట్వర్క్తో పని చేసే ఈ-పోస్ యంత్రాలను డీలర్లకు అందించారు. ఏదైనా సందర్భంలో సంకేతాలు రాకపోయినా, అక్కడ అందుబాటులో ఉండే ఇతర 4జీ, వైఫై నెట్వర్క్లను వినియోగించుకోవచ్చు. ఫలితంగా అంతర్జాల వినియోగంలో ఆటంకాలు తొలగిపోనున్నాయి. గతంలో అందజేసిన ఈ-పోస్ యంత్రాల కాలపరిమితి ముగియడంతో వాటితో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో వాటి స్థానంలో కొత్త యంత్రాలను అందజేశారు. తూకంలో ఏ మాత్రం తేడా ఉన్నా కొత్త యంత్రాల ద్వారా ప్రక్రియ పూర్తి కాదు. తూకం సరిగా ఉంటేనే ప్రక్రియ పూర్తయ్యేలా వాటిని రూపొందించారు. దీంతో పాటు లబ్ధిదారుకు రసీదు అందించేలా అవకాశం కల్పించారు.
డిజిటల్ లావాదేవీలు..
రేషన్ దుకాణాల్లో టీ-వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అది అంతగా కనిపించడం లేదు. ప్రధానంగా నెట్వర్క్ సంబంధిత ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణం. తాజా నిర్ణయంతో ఈ సేవల్లోనూ నాణ్యత మెరుగవుతుంది. సరకుల పంపిణీతో పాటు ఇతర సేవలను సైతం టీ-వ్యాలెట్ని ప్రజలు వినియోగించుకోవచ్చు. విద్యుత్తు, చరవాణి చెల్లింపులు, రైలు, బస్సు టికెట్ల రిజర్వేషన్లు, ఖాతాల్లో నగదు జమ, ఉపసంహరణ తదితర డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల వినియోగదారులకు సేవలు మరింత సులభం కానున్నాయి. అదే సమయంలో డీలర్లకు కమీషన్ పెరగడంతో పాటు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు దూరం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా