స్వశక్తికి.. సర్వోదయ సహకారం
గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే నాలుగు మొక్కలు నాటడం, మోరీలు శుభ్రం చేయడం కాదు. వీలుదొరికినప్పుడు వచ్చి సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం అంతకన్నా కాదంటున్నారు సర్వోదయ ఫౌండేషన్ ప్రతినిధులు. గ్రామస్థులు స్వశక్తితో ఎదిగేలా చేయడం, మరికొంత మందికి వారు ఉపాధి చూ
పెట్టుబడి పెట్టి అండగా నిలిచిన 65 మంది మహిళా వైద్యులు
పుల్కల్ మండలం గొంగ్లూరులో ఉత్పత్తుల తయారీలో మహిళా ఉద్యోగులు
గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే నాలుగు మొక్కలు నాటడం, మోరీలు శుభ్రం చేయడం కాదు. వీలుదొరికినప్పుడు వచ్చి సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం అంతకన్నా కాదంటున్నారు సర్వోదయ ఫౌండేషన్ ప్రతినిధులు. గ్రామస్థులు స్వశక్తితో ఎదిగేలా చేయడం, మరికొంత మందికి వారు ఉపాధి చూపే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటున్నారు. అందులో భాగంగా ‘సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల’ పేరిట కుటీర పరిశ్రమను స్థాపించేలా చొరవ చూపిన వీరు నేడు రెండో దశ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఉన్న ఉత్పత్తులకు తోడు ‘సర్వో మ్యాజిక్’ పేరుతో మరో మూడు రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ ఆర్కే పాలివాల్ పాల్గొననున్నారు.
ఇద్దరితో మొదలై... 135 మందికి చేరిక : ఐఆర్ఎస్ అధికారుల బృందం ఈ గ్రామాన్ని కరోనా కంటే ముందు దత్తత తీసుకుంది. మొదటి దశలోనే వీరు మాస్కుల అవసరాన్ని గుర్తించారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను ప్రోత్సహించారు. వారిద్దరు ప్రతినెలా రూ.15వేల వరకు సంపాదించగలిగారు. ఈ ఘటనతో కుటీర పరిశ్రమకు బీజం పడింది. మహిళలు సొంతంగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ ప్రత్యేక చొరవ చూపారు. పలుమార్లు స్థానిక మహిళలు, గ్రామపెద్దలతో సమావేశాలు నిర్వహించారు. తనతో పాటు చదువుకున్న మహిళా వైద్యులతోనూ కుటీర పరిశ్రమ గురించి చర్చించారు. ఉపాధి లేక.. కూలీ చేస్తున్న మహిళల జీవితాల్లో తమ వల్ల కొంతైనా వెలుగు వస్తుందనే ఉద్దేశంతో వారూ ఆసక్తి చూపారు. అలా ఇద్దరితో మొదలై ఇప్పుడు ఇందులో వాటాదారుల సంఖ్య 135కి చేరింది. ఒక్కొక్కరు తమ తాహతును బట్టి రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అలా రూ.1.99 కోట్లు జమయ్యాయి.
ఫిబ్రవరి నుంచి అవుట్లెట్ : వీరు చేతితో సబ్బులు తయారు చేస్తున్నారు. రైతుల నుంచి కందులు, పెసర్లు కొని పప్పు సిద్ధం చేస్తున్నారు. కుసుమ, పల్లీలాంటి నూనెలు అందుబాటులో తెచ్చారు. ఈ ఉత్పత్తులను విక్రయించేందుకు సంగారెడ్డి పట్టణంలో అవుట్లెట్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు వెళుతూ తమను తాము పరిచయం చేసుకుంటూ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇప్పటి వరకు రూ.16లక్షల విలువైనవి అమ్మారు. నాణ్యతలో రాజీపడకుండా వీరు ఉత్పత్తులను సిద్ధం చేస్తుండటంతో మార్కెట్లో క్రమంగా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు డిటర్జెంట్ కేక్, పౌడర్, లిక్విడ్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
రానున్న రోజుల్లో చిరుధాన్యాలు : ప్రస్తుతం చిరుధాన్యాలకు డిమాండ్ అధికంగా ఉంది. హైదరాబాద్లాంటి నగరాలు మొదలు గ్రామాల్లోనూ ఎక్కువ మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అందుకే వీరు చిరుధాన్యాలనూ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల సాగూ ఎక్కువే. ఇలాంటి అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని వీటిని శుద్ధి చేసి వినియోగదారులకు అందించేలా చూడనున్నారు.
సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల అవుట్లెట్లో విక్రయానికి సిద్ధంగా నూనెలు
పారదర్శకంగా లెక్కలు
గతంలో కూలీనాలీ పనులు చేసుకునే మహిళలూ ఇప్పుడు సర్వోదయ పారిశ్రామికవేత్తలుగా మారారు. అందరూ వాటాదారులే. దాదాపు 25 మంది ఇందులో ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి వారి పనిని బట్టి రూ.8వేల నుంచి రూ.15వేల వరకు వేతనాలు అందుకుంటున్నారు. తమకు వాటా ఉన్న సంస్థలోనే పనిచేస్తూ మరింతగా దీనిని అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఆరోపణలు, వివాదాలకు తావులేకుండా పక్కాగా పారదర్శకతను పాటిస్తున్నారు. ప్రతినెలా వీరు సమావేశమవుతారు. ఆ నెలలో చేసిన ఖర్చు, ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం... ఇలాప్రతి లెక్కనూ సభ్యులకు వివరిస్తారు. దేశంలోనే సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదర్శంగా నిలిపే కృషి కొనసాగుతోంది. అది విజయవంతం కావాలని మనమూ ఆకాంక్షిద్దాం.
- ఈనాడు, సంగారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు