ఆగుతూ.. సాగుతూ..!
పట్టణం దినదినాభివృద్ధి సాధిస్తోంది. అనేక రంగాల్లో ఆదర్శాన్ని చాటుతోంది. అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ మరింత అనువుగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఆ దిశగా జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్రావు చొరవతో భూగర్భ మురుగు కాల్వల (యూజీడీ) నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.
పలుచోట్ల అధ్వానంగా రహదారులు
అసంపూర్తి భూగర్భ మురుగు పారుదల వ్యవస్థతో ఇక్కట్లు
న్యూస్టుడే, సిద్దిపేట
ఇందిరానగర్లో కొనసాగుతున్న పనులు..
పట్టణం దినదినాభివృద్ధి సాధిస్తోంది. అనేక రంగాల్లో ఆదర్శాన్ని చాటుతోంది. అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ మరింత అనువుగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఆ దిశగా జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్రావు చొరవతో భూగర్భ మురుగు కాల్వల (యూజీడీ) నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. 2017లో పనులు ప్రారంభమవగా.. ఇంకా సాగుతున్నాయి. మొత్తం మూడు విడతలుగా చేపట్టారు. రేపుమాపు అనే ప్రకటనలే తప్ప ఇప్పటికీ పూర్తిచేయక అవస్థలు పడుతున్నామని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నారు. అమృత్, టీయూఎఫ్ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధులు మొత్తంగా రూ.301.81 కోట్లు వెచ్చించి చేపట్టారు. పైపులైన్ నిర్మాణం ఇంకా 4 కి.మీ., గృహ కనెక్షన్లు 3 వేలు ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్లవుతున్నా.. పూర్తి కాకపోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులు గడువుగా విధించుకున్నా ఫలితం లేకపోయింది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు ప్రజారోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో రహదారి మరమ్మతులు 75 కి.మీ. మేర చేశారు.
ఇంకా 40 కి.మీ..
అనేక చోట్ల రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. నడవడానికి కూడా అనువుగా లేదు. పట్టణంలో పలు ప్రాంతాల్లో బీటీ, సీసీ దారుల నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటి వరకు టీయూఎఫ్ఐడీసీ నిధులతో 28 కి.మీ. మేర సీసీ దారులు నిర్మించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రూ.42 కోట్లు వెచ్చించి 44 కి.మీ. సీసీ, 14 కి.మీ. బీటీ రహదారుల నిర్మాణం చేశారు. ఆ నిధుల్లో నుంచి ఏడు కూడళ్లను సుందరీకరించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో 98 కి.మీ. మేర నిర్మించాల్సి ఉండగా.. 58 కి.మీ. మేర పూర్తయింది. ఇంకా 40 కి.మీ. నిర్మించాల్సి ఉంది. మరోవైపు బల్దియా అధికారులు ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించడంలో సరైన విధానాన్ని అనుసరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దసంఖ్యలో నివాసాలు, ప్రజలు ఉండే కాలనీలను విస్మరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. శంకుస్థాపనలు చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధ్వానంగా మారిన రహదారులను తొలి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని కాలనీల ప్రజలు కోరుతున్నారు. కౌన్సిల్ సమావేశాల్లోనూ కొందరు కౌన్సిలర్లు యూజీడీ సమస్యలు పరిష్కరించాలంటూ తమ వాణిని వినిపిస్తున్నారు. ఇటీవల రహదారుల నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు విడుదలయ్యాయని, త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న బల్దియా అధికారులు పేర్కొంటున్నారు. పట్టణంలో ఒక్కో చోట ఒక్కో తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. కొన్ని చోట్ల బీటీ, మరికొన్ని చోట్ల సీసీ వేస్తున్నారు. రహదారుల వెడల్పు, పొడవు సహా పాతవి బీటీగా ఉంటే రెన్యూవల్ బీటీ వేస్తున్నారు. అనుబంధ దారులకు సీసీ నిర్మిస్తున్నారు.
కొత్తగా 120 కి.మీ.కి ప్రతిపాదన..
సిద్దిపేటలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న కాలనీలను దృష్టిలో పెట్టుకొని మరో 120 కి.మీ. మేర యూజీడీ నిర్మాణానికి అధికారులు అమృత్ 2.0 కింద ప్రతిపాదించారు. ప్రగతినగర్, ఇందూరు కళాశాల సమీపంలోని టీహెచ్ఆర్నగర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంతం, ఒకటి, రెండవ వార్డుల్లోని వడ్డెర బస్తీ-1, 2లో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. మూడు నెలల కిందట ప్రతిపాదనలు చేశారు. తద్వారా గృహాలకు అనుసంధానంగా 6 వేలు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
సిద్దిపేట రాఘవేంద్రనగర్లోని రోడ్డు నం. 5లో రహదారికి ఇరువైపులా దాదాపు 100 వరకు ఇళ్లు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల కిందట భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఎగుడుదిగుడుగా ఉన్న ఈ మార్గం ఆరంభంలో కొంత మేర సీసీ పూర్తయింది. మిగిలిన మట్టి దారి ఆసాంతం అధ్వానంగా మారింది. నడవడానికి సైతం అనువుగా లేదు. వర్షాకాలం నేపథ్యంలో చిరుజల్లులకే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూడు నెలల్లో పూర్తి చేస్తాం..
మరో మూడు నెలల్లో పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రాధాన్యత క్రమంలోనే పనులు చేస్తున్నాం. ప్రజల ఇబ్బందుల తీర్చుతాం. ఇప్పటికే పలుచోట్ల వెనువెంటనే రహదారుల నిర్మాణం చేస్తున్నాం.
- రవీందర్రెడ్డి, సిద్దిపేట బల్దియా కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!