logo

‘తెరాసలో మహిళలకు సముచిత స్థానం’

తెరాస సిద్దిపేట మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలిగా టైగర్‌ నర్సమ్మను నియమించారు. సంబంధిత పత్రాన్ని పట్టణంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీలో క్రియాశీలకంగా

Published : 03 Jul 2022 01:37 IST

సభ్యులకు నియామకపత్రం అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: తెరాస సిద్దిపేట మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలిగా టైగర్‌ నర్సమ్మను నియమించారు. సంబంధిత పత్రాన్ని పట్టణంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీలో క్రియాశీలకంగా పని చేసే ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు పార్టీలో పని చేస్తున్న మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. ఉపాధ్యక్షులుగా వెంకటమ్మ, భారతి, కనకలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా పద్మ, తార, కార్యదర్శులుగా బాలమణి, వెంకటలక్ష్మి, అనసూయ, షహనాజ్‌ బేగం, సంగీత, కోశాధికారి శోభ, సభ్యులుగా విజయ, రూపారెడ్డి, రామవ్వ, రాజవ్వ, భూదవ్వ, ఎల్లవ్వ, కనకవ్వ, పద్మ తదితరులు ఉన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని