క్రీడా భవితకు చక్కటి వేదిక
క్రీడల్లో ఉత్తమంగా రాణించాలంటే శిక్షణ ఎంతో అవసరం. ఇటు వైపు అడుగేసే విద్యార్థినులకు చేగుంటలోని క్రీడా పాఠశాల చక్కటి వేదికనే చెప్పాలి. ఓ వైపు చదువు, మరోవైపు ఆటలు నేర్పిస్తూ వారి భవితకు మార్గం వేస్తోంది. గిరిజనులను ఈ దిశగా నడిపించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఇక్క
చేగుంట క్రీడా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్టుడే, చేగుంట
లాంగ్జంప్ చేస్తున్న విద్యార్థిని
క్రీడల్లో ఉత్తమంగా రాణించాలంటే శిక్షణ ఎంతో అవసరం. ఇటు వైపు అడుగేసే విద్యార్థినులకు చేగుంటలోని క్రీడా పాఠశాల చక్కటి వేదికనే చెప్పాలి. ఓ వైపు చదువు, మరోవైపు ఆటలు నేర్పిస్తూ వారి భవితకు మార్గం వేస్తోంది. గిరిజనులను ఈ దిశగా నడిపించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఇక్కడ గిరిజన క్రీడా పాఠశాలను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో ఇదొక్కటే క్రీడా పాఠశాల కావడం గమనార్హం. ఇందులో ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలు, వసతుల తీరుపై కథనం.
బాల్త్రో సాధన చేస్తూ..
రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ల కిందట చేగుంటకు గిరిజన బాలికల గురుకులాన్ని మంజూరు చేసింది. ఆ విద్యాసంవత్సరం ఐదో తరగతిని ప్రారంభించగా.. ఏటా అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం జూనియర్ కళాశాల స్థాయికి చేరింది. మూడేళ్ల కిందట ఈ గురుకులంలోనే క్రీడా పాఠశాలను ఏర్పాటుచేశారు. వివిధ క్రీడాంశాల్లో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వసతులు కల్పించారు. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలవాసులే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు తదితర జిల్లాలకు చెందిన గిరిజన బాలికలు ఇందులో చేరేందుకు ముందుకొస్తున్నారు.
శిక్షణ ఇస్తున్న క్రీడాంశాలు..
ప్రస్తుతం చేగుంట క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రగ్బీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఫెన్సింగ్, వాలీబాల్, ఖోఖో తదితర ఆటలకు అవకాశం కల్పించింది. అన్ని రకాల క్రీడలకు ఇందులో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్కు శిక్షకులను నియమించారు. ఇతర క్రీడాంశాలకు సైతం శిక్షకులు త్వరలోనే నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో నలుగురు శిక్షకులు వస్తే ఇందులో ఉన్న విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దవచ్చు. క్రీడా పాఠశాలలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు పలు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధిస్తున్నారు. గురుకులం ఆవరణలో క్రీడా మైదానం కూడా సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అథ్లెటిక్స్ కొరకు సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థినుల కోసం వ్యాయామశాల కూడా ఉంది. అలాగే పక్కా భవనం, వసతిగృహం కూడా ఉండటంతో చాలా మంది ఇందులో ప్రవేశాలకు యత్నిస్తున్నారు.
40 సీట్లు..
ఐదో తరగతిలో మొత్తం 40 సీట్లు ఉంటాయి. ఇందులో ప్రవేశానికి వందలాది దరఖాస్తు చేస్తుంటారు. ఈ పాఠశాలలో ప్రతి ఏటా పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఇంటర్లోనూ ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఓ వైపు ఆటలు, మరోవైపు చదువుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది 700 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏటూరునాగారంలోని గిరిజన బాలుర క్రీడా పాఠశాల ప్రవేశాలకు కూడా చేగుంటలోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ