‘పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు’
ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్జీవన్ పాటిల్ అన్నారు. పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
ప్రజావాణిలో 45 అర్జీల స్వీకరణ
వినతులు ఇచ్చేందుకు బారులు తీరిన అర్జీదారులు
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్జీవన్ పాటిల్ అన్నారు. పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భూసంబంధిత, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 45 అర్జీలు, వినతులు వచ్చాయి. అదనపు పాలనాధికారి (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, ఏవో అబ్దుల్ రెహ్మాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
* అకారణంగా తనను వేధిస్తున్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలంటూ ఓ విద్యార్థిని కలెక్టర్కు మొరపెట్టుకుంది. హుస్నాబాద్ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదవుతున్న విద్యార్థిని హరిణి తనపై ప్రిన్సిపల్ శ్రీదేవి అభాండాలు మోపుతోందని తల్లిదండ్రులతో కలసి వినతిపత్రం సమర్పించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాధికారి రవికాంత్రావును కలెక్టర్ ఆదేశించారు.
* బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులను వివిధ రుసుములు చెల్లించాలంటూ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ సిద్దిపేటలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ఇటీవల చేరారన్నారు. ఉచితంగా విద్య అందించాల్సి ఉండగా ప్రవేశ రుసుము, ఏకరూప దుస్తులు, పుస్తకాల పేరిట సొమ్ము చెల్లించాలంటున్నారని ఫిర్యాదు చేశారు.
* కూతురు ప్రిన్సికి జనన ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలంటూ సిద్దిపేటకు చెందిన సంజన వినతిపత్రం సమర్పించారు. తమ స్వస్థలం నిజామాబాద్ జిల్లా అని, మూడేళ్లుగా సిద్దిపేటలో నివాసం ఉంటున్నట్లు.. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్చామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో