మూడేళ్లు.. ఇంకెన్నాళ్లు..!
అందుబాటులోకి రాని డంప్యార్డు
న్యూస్టుడే, గజ్వేల్
యార్డు ఆవరణలో చెత్తాచెదారం
ఏడాదిలో డంప్ యార్డు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పాలకమండలి పేర్కొన్నా కార్యరూపం దాల్చలేదు. తడి, పొడి చెత్తను వేరు చేసి.. ఎరువుల తయారీ, ఇతర మార్గాల ద్వారా ఆదాయన్ని సమకూర్చుకోవటంతోపాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సి ఉన్నా పనులు మాత్రం ఆ దిశగా ముందుకు సాగటం లేదు. 2019 నుంచి నిర్మాణ పనులు సాగుతున్నా ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. డంప్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.కోటి మంజూరు చేసింది. ఇప్పటిదాకా సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చు చేసి రెండు షెడ్లు నిర్మించారు. నెల క్రితం సేంద్రియ ఎరువు తయారీ చర్యలు చేపట్టారు. మరోవైపు పొడి చెత్త నిర్వహణకు యంత్రం ఏర్పాటు చేశారు. పనులు ఇంకా వేగిరం కాలేదు.
రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నా...
యార్డుకు వెళ్లేందుకు నిర్మిస్తున్న దారి మధ్యలో హెచ్టీ విద్యుత్తు టవర్ ఉంది. అది అడ్డుగా ఉన్నా అధికారులు నిర్మిస్తున్నారు. వాహనాలు ఎలా వెళుతాయో వారికే తెలియాలని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం టన్నుల కొద్దీ చెత్త యార్డులో నిల్వ చేయటంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వర్షం కురిసిన సందర్భంలో చెత్త నుంచి వెలువడుతున్న జలాలు పంట పొలాల్లోకి వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. డంపుయార్డు అందుబాటులోకి రాకపోవటంతో చెత్త సేకరణ ప్రక్రియపై ప్రతికూలతను చూపుతుంది. కొన్ని శివారు ప్రాంతాల్లో చెత్త పారబోస్తుండటంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. కొంతవరకు యార్డుకు తరలిస్తున్నా చాలావరకు బయట పారబోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కోళ్ల వ్యర్థాలనూ తరలిస్తుండటంతో దుర్వాసన వస్తోందని వాపోతున్నారు.
విద్యుత్తు టవర్ అడ్డుగా ఉన్నా నిర్మిస్తున్న రహదారి
త్వరలోనే పూర్తి చేయిస్తాం..
- విద్యాసాగర్, పురపాలిక కమిషనర్
డంప్ యార్డు నిర్మాణం సాగుతోంది. పొడి చెత్త నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పజెప్పాం. రోడ్డు నిర్మాణం, మొక్కలు, విద్యుత్తు దీపాల ఏర్పాటు పనులు చేపట్టాల్సి ఉంది. త్వరలోనే పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొస్తాం. దారిలో అడ్డుగా ఉన్న విద్యుత్తు టవర్ను మార్పించడానికి చర్యలు తీసుకుంటాం.
పురపాలికలో ఇలా..
మొత్తం.. 20 వార్డులు
జనాభా: 55,000
నివాసాలు: 11,000
రోజూ ఉత్పత్తి అయ్యే చెత్త: 18 టన్నులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
-
India News
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్య.. మరో వలసకూలీ దారుణ హత్య..!
-
Crime News
YS Viveka Murder Case: విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలి: వివేకా కుమార్తె పిటిషన్
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు.. 49 మరణాలు..!
-
Sports News
IND vs ZIM: ఇది శిఖర్ ధావన్ను అవమానించడమే.. బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- AP Govt: మరో బాదుడు
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్