చిగురించిన ఆసరా ఆశలు!
ఎట్టకేలకు దరఖాస్తుదారుల ఆశలు నెరవేరబోతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 57 ఏళ్ల వయస్సు గల వారికి ఆసరా పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై వారికి ఊరట కలిగినట్లయింది.
న్యూస్టుడే, మెదక్
మెదక్ ప్రాంతీయ ఆసుపత్రి డయాలసిస్ వార్డులో రోగులు
ఎట్టకేలకు దరఖాస్తుదారుల ఆశలు నెరవేరబోతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 57 ఏళ్ల వయస్సు గల వారికి ఆసరా పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై వారికి ఊరట కలిగినట్లయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికారులు ఈనెల 15న పింఛను పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నారు. దివ్యాంగులకు రూ.3,016, మిగతా కేటగిరీల వారికి రూ.2,016 చొప్పున ఖాతాల్లో జమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1,00,248 మందికి పింఛను ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రతి నెలా రూ.21.05 కోట్లు వెచ్చిస్తున్నారు.
16 వేల మందికి పైగా అవకాశం...
ఆసరా పథకానికి అర్హత వయస్సు 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ముఖ్యమంత్రి 2019లో ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో 57 ఏళ్లు, ఆపైబడి ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 16,858 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పాపన్నపేట మండలంలో దరఖాస్తు చేసుకున్నారు. వారంతా చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. పలుమార్లు మంత్రులు ప్రకటన చేయగా, 2022-23 రాష్ట్ర బడ్జెట్లో సైతం ప్రస్తావించారు. ఎట్టకేలకు ఇటీవల సీఎం చేసిన ప్రకటన వారికి కాస్త ఊరటనిచ్చింది. ఇదిలా ఉంటే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళల పింఛను కోసం 9,281 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పింఛను మంజూరుపై స్పష్టత లేదు. మరోవైపు డయాలసిస్ రోగులకు పింఛను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మెదక్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ వార్డు ఉండగా.. ఇక్కడికి ప్రతి నెలా సుమారు 60 మంది రోగులు వస్తుంటారు. మిగతా ఇరవై మంది హైదరాబాద్లోని ఆసుపత్రులకు వెళ్తున్నారు. వారికి నెలకు రూ.2,106 పింఛను అందనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపడుతామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.