వరండాలో వంట.. కళ్లకు మంట!
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు నిర్వాహకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు వానలు, మరోవైపు వంట గదులులేక వరండాలే ఆధారమవుతున్నాయి. ఇక తరగతుల్లోకి పొగ వ్యాపించి పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. కొన్నిచోట్ల గదులున్నా స్థలం సరిపోవటంలేదు.
పొగతో విద్యార్థుల...
ప్రత్యేక గదుల్లేక నిర్వాహకుల అవస్థలు
న్యూస్టుడే, చేగుంట
చేగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో...
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు నిర్వాహకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు వానలు, మరోవైపు వంట గదులులేక వరండాలే ఆధారమవుతున్నాయి. ఇక తరగతుల్లోకి పొగ వ్యాపించి పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. కొన్నిచోట్ల గదులున్నా స్థలం సరిపోవటంలేదు. సర్కారు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు మాత్రమే అక్షయపాత్రద్వారా సరఫరా చేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో ఆవరణలోనే వంట వండుతున్నారు. అయితే వీరికి సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. వర్షాకాలంలో వారి తిప్పలు చెప్పనలవి కాదు. వానలకు కర్రలు తడిసి విపరీతమైన పొగ వ్యాపిస్తోంది. దీనివల్ల నిర్వాహకులతో పాటు విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కట్టెలు మండకపోవటంవల్ల వంటలు కూడా సరిగా ఉండటం లేదు. ముఖ్యంగా అన్నం ఉడకటంలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
జడ్పీ ఉన్నత పాఠశాలలకు కష్టం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటున్నారు. వారికి వంట చేసేందుకు గది పెద్దగా ఉండాలి. అయితే ప్రభుత్వం గతంలో చిన్న గదులను నిర్మించింది. అందులో వంట చేయటం ఏమాత్రం కుదరటంలేదు. దీంతో చెట్ల కింద, వరండాలే దిక్కవుతున్నాయి. జిల్లాలో కొన్ని బడుల్లో మాత్రమే వంటగదులను వినియోగిస్తున్నారు. కనీసం వంటపాత్రలు, నిత్యావసర సరకులు కూడా నిల్వచేసుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో వంట గదులు శిథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే ఉరుస్తున్నాయి.
జిల్లాలో పాఠశాలలు ఇలా
ప్రాథమిక: 624
ప్రాథమికోన్నత:128
జడ్పీ ఉన్నత: 148
ఆదర్శ పాఠశాలలు:7
మొత్తం విద్యార్థులు: 92,245
ఇదీ పరిస్థితి..
చేగుంట మండలం వడియారం, చేగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో వంటగదులులేవు. వడియారం పాఠశాలలో ఒక పక్క తరగతులు, మరో వైపు మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్నారు. కట్టెలు తడిసిపోయి ఉండటంవల్ల పొగ ఎక్కువగా వస్తుంది. చేగుంటలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల్లో వంట చేస్తున్నారు. ఇక్కడ వంట గది నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నార్సింగిలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ వంట గది చిన్నగా ఉండటంవల్ల ఆరుబయట చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో వంటగదుల కొరత తీవ్రంగా ఉంది. మక్కరాజుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా ఆరుబయటనే వంటలు చేస్తున్నారు. రామాయంపేట బాలికల పాఠశాలలో చిన్నరేకుల షెడ్డు వేశారు.చల్మెడ, నిజాంపేట జడ్పీ పాఠశాలల్లో ఆరుబయట వండుతున్నారు. వెల్దుర్తి మండలం బండపోసాన్పల్లి, మంగళపర్తి తదితర పాఠశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల, పెద్ద, చిన్న హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, తమ్మాయిపల్లి, కొంపల్లి, రాజ్యతండా, తుమ్ముతండా తదితర ప్రాథమిక పాఠశాలలో సైతం ఆరుబయటే వండుతున్నారు. ఇలా ప్రతి మండలంలో ఉన్న జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నెలకొంది.
‘మన ఊరు..మన బడి’లో నిర్మిస్తాం : - రమేష్కుమార్, డీఈవో, మెదక్
‘మన ఊరు..మన బడి’ మొదటి విడతలో మంజూరైన పాఠశాలల్లో నిర్మాణం చేపట్టి పూర్తిచేస్తాం. రెండో విడతలో మంజూరయ్యాక మిగతా వాటిల్లో ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ నిధులతో వంటగదులను నిర్మించుకునే అవకాశం ఉంది. సమస్య అధికంగా ఉన్న చోట ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్